Gambhir vs Parth Jindal: సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో భారత్ వైట్ వాష్ అయిన తర్వాత అందరి వేళ్ళు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూపించాయి. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్ వేదికగా జరిగిన చివరి మూడు టెస్ట్ సిరీస్ లలో రెండు వైట్ వాష్ అయ్యింది. న్యూజిలాండ్ పై మూడు, దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల్లో కనీసం డ్రా కూడా చేయలేకపోయింది.
Also Read: Gautam Gambhir: పొర్లు దండాలు పెట్టినా, 2027 వరల్డ్ కప్ లో ఆ ఇద్దరినీ ఆడనివ్వను ?
జట్టులోని సీనియర్ల తొలగింపు, మార్పులు, బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలతో గౌతమ్ గంభీర్ భారత టెస్ట్ ప్రభావాన్ని దెబ్బతీశాడని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌహతి వేదికగా జరిగిన రెండవ టెస్టులో భారత్ ఏకంగా 400కు వైగా పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో.. టీమిండియా అభిమానులంతా గౌతమ్ గంభీర్ ని టార్గెట్ చేశారు.
గౌహతి వేదికగా జరిగిన టెస్టులో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయిన తరువాత.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కో – ఓనర్ పార్థ్ జిందాల్. టీమిండియా టెస్ట్ జట్టుకు స్పెషలిస్ట్ కోచ్ ఉండడంపై బీసీసీఐ ఆలోచన చేయాలని అన్నాడు. ఈ మేరకు గౌహతి టెస్ట్ అనంతరం సోషల్ మీడియా వేదికగా పార్థ్ జిందాల్.. ” సొంత గడ్డపై ఇంతటి భారీ పరాజయం ఎప్పుడూ చూడలేదు. రెడ్ బాల్ స్పెషలిస్టులు లేకపోవడం వల్లే ఈ ఓటమి వచ్చింది. ఇప్పటికైనా టెస్టులకు ప్రత్యేక కోచ్ ని నియమించాలి”. అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన అనంతరం తనపై వచ్చిన విమర్శలు అన్నింటికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. ” మేము టెస్ట్ సిరీస్ ఓడిపోయిన అనంతరం ఎన్నో విమర్శలు చేశారు. అందులో సగం క్రికెట్ కి సంబంధించినవి కాదు. టెస్ట్ సిరీస్ లో ఎందుకు ఓడిపోవలసి వచ్చింది అనే అంశంపై ఎవరూ మాట్లాడకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలు అనుకూలంగా రానప్పుడు చర్చ జరగడం సహజం. కానీ ఏ మీడియాలోనూ మొదటి టెస్ట్ లో ఎలా ఓడిపోయామన్న విషయాన్ని రాయలేదు.
గాయం కారణంగా కెప్టెన్ గిల్ రెండు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆ మ్యాచ్ లో అదే వ్యత్యాసం కనిపించింది. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లలో ఓటమికి సాకులు చెప్పడం నాకు రాదు. నిజాన్ని ప్రపంచానికి తెలియజేయవద్దని నేను అనను. జట్టు మార్పు దశలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎదురవుతాయి. ఈ విషయాల గురించి ఎవరూ ప్రస్తావించలేదు. క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా పిచ్ పై విమర్శలు చేశారు. ఐపీఎల్ లో ఓ ఫ్రాంచైజీ ఓనర్ ఒకరు ఏకంగా కోచింగ్ వ్యవస్థనే విభజించాలని మాట్లాడారు. ఎవరైనా సరే తమ హద్దుల్లో తాము ఉంటే మంచిది. విమర్శించేటప్పుడు మాటలు అదుపులో పెట్టుకోవాలి” అని జిందాల్ ని ఉద్దేశించి గౌతమ్ గంభీర్ ఘాటు రిప్లై ఇచ్చాడు.
So Now It’s Parth Jindal Vs Gautam Gambhir.
Anyone Can Have Opinion, No Need To Mention It During Press Conference.
IPL OWNER IS ALSO A CRICKET FAN. pic.twitter.com/jOY9pe3oVY
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) December 6, 2025