Women’s World Cup 2025 : ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ప్రారంభం అవ్వడానికి ఇంకా రెండు నెలల కంటే సమయం తక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మన టీమ్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సారి టీమిండియా చరిత్ర తిరగరాయడం పక్కా అని ధీమాగా ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఇండియాను వరల్డ్ కప్ ఫైనల్స్ కి తీసుకెళ్లిన ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆమె పెద్ద టోర్నీలలో ప్రెజర్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు అని చెప్పింది. ఈ సారి టీమ్ లో ఏదో స్పెషల్ వైబ్ ఉందని.. ప్లేయర్స్ లో కూడా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్ లో ఉన్నాయని చెప్పింది. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఓవైపు ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుందనే ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. బీసీసీఐ పై ఆర్సీబీ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఎందుకంటే..?
Also Read : Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !
బెంగళూరు అభిమానులకు నిరాశ
వాస్తవానికి ముందుగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఉమెన్స్ వరల్డ్ కప్ లోని కొన్ని మ్యాచ్ లు నిర్వహించాలని అనుకున్నారు. కానీ మొన్న జరిగిన తొక్కేసలాటకు అక్కడి నుంచి షిఫ్ట్ చేయబోతున్నారట తిరుమనంతపురానికి. దీంతో బెంగళూరు క్రికెట్ అభిమానులు కాస్త ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు భారత మహిళల జట్టు క్రికెట్ లో గత కొద్ది సంవత్సరాలుగా నిలకడైన ప్రదర్శనతో మంచి విజయాలను సాధిస్తోంది. అయితే ఇప్పటికీ వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. టీ-20ల్లో, ఇటు వన్డేల్లో రెండింటిలో భారత మహిళల జట్టు ఒక్కసారి కూడా విజేతగా మాత్రం నిలవలేకపోయింది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్ లలో రన్నరప్ గా నిలిచిన మహిళల జట్టు.. 2022లో సెమీ ఫైనల్ కే పరిమితమైంది.
ఈసారి వరల్డ్ కప్ మనదే..?
ఇక ఈ సారి మాత్రం గెలుపు గీత దాటుతామని ఉమెన్స్ టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో తమకు పలు సానుకూలతలు ఉన్నాయని వెల్లడించింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 02 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టోర్నమెంట్ మరో 50 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఉమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెనీమా రోడ్రిగ్స్, మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఐసీసీ చైర్మన్ జై షా, సీఈవో గుప్త, బిసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో పాటు 2011 పురుషుల వన్డే వరల్డ్ కప్ ప్లేయర్ ఫ్లేయర్ ఆప్ ద టోర్నీ యువరాజ్ సింగ్ పాల్గొన్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న భారత అభిమానుల కోరికను ఈ వరల్డ్ కప్ తో నేరవేరుస్తామని హర్మన్ ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది.