Sachin Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం…. రెండు రోజుల కిందట ముగిసిన సంగతి తెలిసిందే. నవంబర్ 24వ తేదీ అలాగే నవంబర్ 25వ తేదీలలో ఈ మెగా వేలం ప్రక్రియను… ముగించేశారు. ఈ మెగా వేలంలో… చాలామంది ప్లేయర్లు… కోట్ల రూపాయలను దక్కించుకోగలిగారు. మరి కొంతమంది ప్లేయర్లు అయితే అమ్ముడు కూడా పోలేదు. స్టీవ్ స్మిత్, అజింక్య రహానే, సర్ఫ్ రాజ్ ఖాన్, అలాగే.. శార్తులు ఠాకూర్ లాంటి ప్లేయరు అన్సోల్డ్ గా మిగిలారు.
కొంతమంది ప్లేయర్లను మరో రౌండ్ లో కూడా కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు. ఇక హైదరాబాద్ మాజీ కెప్టెన్… ఢిల్లీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ను ఏ రౌండ్ లో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. ఇతరుణంలో డేవిడ్ వార్నర్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇదంతా పక్కకు పెడితే… సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు ఈ మెగా వేలంలో ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు.
ఈ మెగా వేలం కంటే ముందు రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన అర్జున్ టెండూల్కర్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో un sold ప్లేయర్ గా మిగిలాడు అర్జున్ టెండూల్కర్. మొదటి రౌండులో అమ్ముడుపోని అర్జున్ టెండూల్కర్ ను (arjun tendulkhar ) మరోసారి ముంబై ఇండియన్స్ ఆదుకుందని చెప్పవచ్చు. అర్జున్ టెండూల్కర్ ను బేస్ ధర అయిన 30 లక్షలకు… కొనుగోలు చేసింది అంబానీ టీం. దీంతో సచిన్ టెండూల్కర్ పరువు కాపాడినట్లు అయింది.
అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయకపోతే పెను ప్రమాదమే జరిగేది. అయితే అర్జంట్ టెండూల్కర్ ను 30 లక్షల రూపాయలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ తండ్రి సచిన్ టెండూల్కర్ తన దగ్గర ఉన్న డబ్బులను… ముంబై ఇండియన్స్ కు ఇచ్చి… తిరిగి తన కొడుకుని కొనుగోలు చేయాలని…. కుట్రలు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తన కొడుకు కోసం తానే డబ్బులు ఇచ్చాడని సచిన్ టెండూల్కర్ ను ఉద్దేశించి కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. దారుణంగా పోస్టులు పెడుతున్నారు. కొడుకు పరువు కాపాడడం కోసం ముంబై ఇండియన్స్ కు సచిన్ టెండూల్కర్ లంచం ఇచ్చాడని కూడా అంటున్నారు. అయితే దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సచిన్ పైన ఉన్న గౌరవంతో అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అటు సచిన్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్ తరఫున ప్లేయర్గా ఆడాడు. ఆ తర్వాత.. ఆ జట్టుకు మెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. అనంతరం అర్జున్ టెండూల్కర్ ను కూడా ముంబై ఇండియన్స్ లో చేర్చాడు. అప్పటినుంచి ఆ టీంలోనే అర్జెంట్ టెండుల్కర్ కొనసాగడం గమనార్హం.