E-Paper
Advertisement

PSL – ECB: పాకిస్థాన్ ఇజ్జత్ పాయె.. ఇంగ్లాండ్ దెబ్బ ఉరేసుకోవాల్సిందే

PSL – ECB: పాకిస్థాన్ ఇజ్జత్ పాయె.. ఇంగ్లాండ్ దెబ్బ ఉరేసుకోవాల్సిందే

PSL – ECB:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ( Pakistan Cricket Board ) ఎక్కడ చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ను కొనసాగిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ ఈవెంట్ నిర్వహించడానికి… వేదిక దొరకడం లేదు. ఉగ్రవాద దేశమంటూ పాకిస్తాన్ పై కొత్త ముద్ర పడిపోయింది. దీంతో పాకిస్తాన్ ( Pakistan ) దేశాన్ని ఎవరు నమ్మడం లేదు.

 

ఛీ కొట్టిన ఇంగ్లాండ్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంటును ( Pakistan Super League 2025 Tournament) మొదట యూఏఈ లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఈ ఈవెంట్ నిర్వహించేందుకు మొదట దుబాయ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంటు నిర్వహించడానికి అనుమతులు లేవని తేల్చి చెప్పేసింది. దీంతో పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ బోర్డును ( ECB ) రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే ఐపీఎల్ 2025 టోర్నమెంటు (IPL 2025) నిర్వహించడానికి… తాము సిద్ధంగా ఉన్నామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఎన్ని రోజులైనా.. నిర్వహించుకోండి అని తేల్చి చెప్పేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.

అయితే ఇదే అదునుగా చూసిన పాకిస్తాన్… ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును అడిగి… చూసింది. ఇంగ్లాండ్ దేశంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తులను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖం మీదే ఛీ కొట్టింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. మీలాంటి దేశపు టోర్నమెంటు తమ దేశంలో నడిస్తే.. పరువు పోతుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసిందని తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ పై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏ దేశానికి వెళ్లిన ఇదే పరిస్థితి నెలకొంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. ఎలా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించాలని.. గాబరా పడిపోతుంది.

చక్రం తిప్పిన ఐసీసీ చైర్మన్ జై షా

దుబాయ్ అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు రెండు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ఒప్పుకోవడం లేదు. పోయి గంగలో కలవండి తప్ప తమ దగ్గరికి రాకూడదని రెండు బోర్డులు… పాకిస్తాన్ పరువు తీసాయి. అయితే దీని అంతటికి కారణం అమిత్ షా కుమారుడు ఐసీసీ చైర్మన్ జై షా అంటున్నారు. దుబాయ్ అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులకు ఐసీసీ చైర్మన్ జై షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. అందుకే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు అస్సలు ఒప్పుకోవడం లేదు ఈ రెండు దేశాలు.

Tags

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×