Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అతను క్రికెట్ లో టీమిండియా తరపున ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు. కోహ్లీ 30 పరుగులు చేస్తే.. బెంగళూరు జట్టు విజయం సాధిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు రెండో స్జానంలో కొనసాగుతోంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం హాట్ బ్యూటీ అవ్ నీత్ కౌర్ ని ఫాలో అవుతున్నాడు. ఈమె 2014లో వచ్చిన మర్దానీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించింది. అలాగే అతిథి పాత్రల్లో కూడా కనిపించింది.
Also Read : Mumbai Indians : జియో, MIపై విమర్శలు…. BCCI ఏం పీకుతోంది!
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆ బ్యూటీని ఫాలో అవ్వడం.. అనుష్క శర్మ కొంప మునిగినట్టేనా..? అంటూ కామెంట్స్ పెట్టడం గమనార్హం. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం. ఇక ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితా కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఆడిన 10 ఇన్నింగ్స్ లో 63.28 యావరేజ్ తో 139 స్ట్రైక్ రేట్ తో 443 పరుగులు చేశాడు. ఆరు అర్థ శతకాలు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 విజయాలు, మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఇవాళ గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ప్లే ఆప్స్ కి వెళ్లకుండానే ఇంటిదారి పట్టే అవకాశముంది.
మరోవైపు 2024లో టీ-20 ప్రపంచ కప్ సాధించిన తరువాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు కోహ్లీ. కొత్త ప్లేయర్లు జట్టులోకి వచ్చి టీ 20 ప్రపంచ కప్ కోసం సన్నద్ధం కావడానికి రెండేళ్లు పడుతుందని.. అందుకే 2024 ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికినట్టు వెల్లడించాడు. కొత్త ఆటగాళ్లు ఒత్తిడిని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలని.. ప్రపంచ కప్ సమీపించే కల్లా వీలైనన్నీ ఎక్కువ మ్యాచ్ లు ఆడి తాము రెడీగా ఉన్నామని ఫీల్ అవ్వాలి. ఇదంతా జరగడానికి రెండేళ్ల సమయం పడుతోంది. అందుకే టీ 20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించినట్టు వివరించారు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆడుతున్న బెంగళూరు జట్టుకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ లో టైటిల్ రాలేదు. ఈ సారి అయినా టైటిల్ సంపాదించాలనే ఆకాంక్షతో ఉంది. మరీ ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ఏ జట్టు ఎగరేసుకుపోతుందో వేచి చూడాలి మరీ.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 2, 2025