BigTV English

Mumbai Indians : జియో, MIపై విమర్శలు…. BCCI ఏం పీకుతోంది!

Mumbai Indians : జియో, MIపై విమర్శలు…. BCCI ఏం పీకుతోంది!

Mumbai Indians: ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నారు. తొలుత గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు టాప్ ప్లేస్ లో కొనసాగాయి. కొద్ది రోజుల తరువాత ఆర్సీబీ టాప్ లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టాప్ లోకి వచ్చేసింది. ఇవాళ గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే.. మళ్లీ టాప్ లోకి దూసుకొచ్చే అవకాశాలున్నాయి. ఇలా ఐపీఎల్ లో ఏ టీమ్ ఎప్పుడూ పుంజుకుంటుందో ఊహించడం కూడా కష్టంగా మారిందనే చెప్పాలి.


Also Read : Ambani’s Dog: అంబానీ ఇంట విషాదం.. కుక్క కోసం ముంబై ప్లేయర్లకు నరకం చూపిస్తున్నారా?

ఇదిలా ఉంటే.. బీసీసీఐ ఓ నిబంధనను ఉల్లంఘించిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెన్స్ ను నివారించే క్రమంలో బోర్డు పదవులలో ఉన్నవారికి ఐపీఎల్ జట్లతో ఎటువంటి సంబంధం ఉండకూడదనేది బీసీసీఐ పాటిస్తున్న ఓ నిబంధన. అయితే ముంబై ఇండియన్స్ యజమాని రిలయన్స్ ప్రస్తుతం COI కే పాల్పడుతోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ ప్రసారం చేస్తున్న జియో, ఓ జట్టు కు యజమానిగా ఉండటం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. అయితే డీఆర్ఎస్ నిర్ణయాలకు జియోకి సంబంధం ఉండదని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ విమర్శించడం విశేషం.


మరోవైపు అంపైరింగ్ విధానం కూడా కాస్త తలనొప్పిగా మారుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో సమస్య మరింత కాస్త ఎక్కువ అయిందనే చెప్పాలి. బంతి బ్యాట్ కి తగలకున్నా ఔట్ ఇవ్వడం.. డీఆర్ఎస్ విషయంలో అంపైర్లు కొన్ని ఫ్రాంచైజీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని వివాదాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయంలో అంపైర్లు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఔట్ అయిన విధానం పై అంపైర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇషాన్ కిషాన్ విషయంలో అంపైర్ ముంబై ఇండియన్స్ కి ముంబై కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ఇటీవల మరో డీఆర్ఎస్ డిసిషన్ కూడా వివాదస్పదంగా మారింది. ముంబై-రాజస్థాన్ లో భాగంగా రోహిత్ శర్మ డీఎస్ఎస్ విషయంలో కాపాడారంటూ అంపైర్ మండిపడుతున్నారు నెటిజన్లు. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో అంపైర్ రోహిత్ ను ఎల్బీడబ్ల్యూ గా ప్రకటించాడు. కానీ రోహిత్ చివరి క్షణంలో రివ్యూ కోరాడు. అయితే థర్డ్ ఎంపైర్ బాల్ ట్రాకింగ్ చేయడంతో బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్టు తేలింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక సమస్య ఎక్కడ వచ్చిందంటే.. డీఆర్ఎస్ నిబంధనల ప్రకారం.. 15 సెకన్లలోపే రివ్యూ తీసుకోవాలి. ఈ మ్యాచ్ లో రోహిత్ రివ్యూ కోరినప్పుడు టైమర్ 0 సెకన్లు చూపించింది. అంటే రివ్యూ టైమ్ కంప్లీట్ అయిన తరువాతనే అంపైర్లు రోహిత్ శర్మ రివ్యూని ఓకే చేశారు. ఈ విషయం గురించి వివాదస్పదంగా మారడం విశేషం. ఇలా రకరకాలుగా ముంబై ఇండియన్స్ పై ట్రోలింగ్ చేయడం గమనార్హం.

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×