Virat – Anushka: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా నేరుగా ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఆస్ట్రేలియా పైన… ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ… మంచి ఇన్నింగ్స్ ఆడి దుమ్ము లేపాడు. అయితే.. ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లు సంబరాలు జరుపుకున్నారు.
Also Read: Ravindra Jadeja: చేతికి టేపు.. జడేజాపై చర్యలు…ICC రూల్స్ ఇవే ?
స్టేడియంలోనే ఎగిరి గంతేశారు టీమిండియా ఆటగాళ్లు. ఈ తరుణంలోనే ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ప్లేయర్ లందరికీ షేక్ అండ్ ఇస్తుండగా…. గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న.. ఆయన భార్య అనుష్క శర్మ… కోహ్లీ అంటూ పిలిచింది. ఆమె చేతు ఊపుతూ… విరాట్ కోహ్లీని పలకరించింది. అయితే టీమిండియా ప్లేయర్లతో ఉన్న విరాట్ కోహ్లీ… వెంటనే అనుష్క వైపు చూసి తాను కూడా… సైగలు చేశాడు.
ఇక విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ మధ్య జరిగిన ఈ సంభాషణ… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరూ క్యూట్ కపుల్స్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం… అది ఎడిటెడ్ వీడియో అంటున్నారు. మ్యాచ్ మధ్యలో జరిగిన వీడియోను… చివర్లో జరిగినట్లు ఎడిట్ చేసి పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం… ఈ వీడియో చూసి తెగ సంబరపడిపోతున్నారు.
ఇది ఇలా ఉండగా… ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా.. టీమిండియా యంగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసిన బంతిని పట్టుకోవడం చేతకాదా ? నీకు కళ్ళు దొబ్బాయా ? అంటూ… గ్రౌండ్ లోనే విరాట్ కోహ్లీ అలాగే… రోహిత్ శర్మ ఇద్దరు తిట్టారు. వాస్తవానికి మ్యాచ్ మధ్యలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేస్తుండగా.. ఆస్ట్రేలియా బ్యాటర్ కొట్టిన బంతి కోహ్లీ చేతికి వెళ్లింది. దీంతో వెంటనే ఆ బంతుని తీసుకొని.. కుల్దీప్ యాదవ్ వైపు వేశాడు కోహ్లీ.
Also Read: NZ VS SA: బ్యాటింగ్ తీసుకున్నన్యూజిలాండ్..సౌత్ ఆఫ్రికాకు నాకౌట్ సెంటిమెంట్
కోహ్లీ బలంగా విసరడంతో ఆ బంతిని పట్టుకునేందుకు వెనకాడాడు. చేతికి దెబ్బ తగులుతుంది.. అనే యాంగిల్ లో చేతులు వెనక్కి పెట్టి వదిలేసాడు. దీంతో వెంటనే రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు. కాగా ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా చంపేస్ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఇవాళ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచిన జట్టుతో ఫైనల్ ఆడుతుంది టీమిండియా.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">