E-Paper

Virender Sehwag: రాజ‌స్థాన్ ఓపెన‌ర్లుగా వైభ‌వ్, ఆశీర్వాద్ ల‌కు ఛాన్స్ ఇవ్వండి

Virender Sehwag: రాజ‌స్థాన్ ఓపెన‌ర్లుగా వైభ‌వ్, ఆశీర్వాద్ ల‌కు ఛాన్స్ ఇవ్వండి

Virender Sehwag:  15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని తట్టుకోవడమే కష్టం అని భావిస్తున్న బౌలర్లు.. ఇప్పుడు మరో సవాల్ ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిందే. తాజాగా వైభవ్ సూర్య వంశీ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. వైభవ్ (Vaibhav Sooryavanshi) 15 ఏళ్లు అయితే.. ఈ బుడ్డోడు పదేళ్లు మాత్రమే. కానీ చిచ్చర పిడుగులా బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 87 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు ఆశీర్వాద్ సూర్యవంశీ. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పదేళ్ల బుడ్డోడి పేరు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అన్ని అనుకుంటే ఇప్పుడు తమ్ముడు ఆశీర్వాద్ ( Ashirvad Sooryavanshi ) బౌలర్లకు నరకం చూపిస్తున్నాడని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ ( Ashirvad Sooryavanshi century) బ్యాటింగ్ అదరగొట్టిన నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. వెంటనే వైభవ్ అలాగే ఆశీర్వాద్ ఇద్దరినీ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లుగా బరిలోకి దింపాలని కామెంట్ చేశారు. ఈ ఇద్దరు బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

రాజ‌స్థాన్ ఓపెన‌ర్లుగా వైభ‌వ్, ఆశీర్వాద్ ల‌కు ఛాన్స్ ఇవ్వండి

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. వైభవ్ సూర్య వంశీ సిక్సర్లు అలాగే బౌండరీలతో రెచ్చిపోతుంటే.. అతడి సోదరుడు ఆశీర్వాద్ మాత్రం కాస్త రిలాక్స్ గా 100 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సమస్తి పూర్ లో జరిగిన లోకల్ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల బుడ్డోడు ఆశీర్వాద్ సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ ఫ్యామిలీలో అందరూ చిరుత పులిలా దూసుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి కుర్రాళ్ళు ఉండడం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. వీళ్లను పెంచిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఈ ఇద్దరి కుర్రాళ్లను రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లుగా బరిలోకి దించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు బరిలోకి దిగితే రాజస్థాన్ సులభంగా 300 పరుగులు సాధించడం గ్యారంటీ అని వెల్లడించారు. రాజస్థాన్ రాయల్స్ కు వరుసగా టైటిల్స్ కూడా తీసుకువచ్చే బాధ్యత వీళ్ళకి అప్పగించాలని కామెంట్ చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

Inzamam-ul-Haq : మా మ‌గాళ్ల వ‌ల్ల కాలేదు, మీరైనా టీమిండియాను చిత్తుగా ఓడించండి

అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

IPL Cheerleader: ఇండియా అంటేనే న‌ర‌కం..త‌ప్పుడు రిపోర్ట్ తో 5 రోజులు చుక్క‌లు చూపించారు !

ప్ర‌మాదంలో ఆస్ట్రేలియా..రంగంలోకి 40 ఏళ్ల ముస‌లోడు, ఇక ర‌చ్చ ర‌చ్చే

ట్రావిస్ హెడ్ పై పాట్ కమ్మిన్స్ సీరియ‌స్‌.. ఆ ఓవ‌రాక్ష‌న్ వ‌ల్లే SRH కొంప‌మునిగింది

PSLకు పోటీగా తాలిబ‌న్లు అదిరిపోయే ప్లాన్‌..మ‌ళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియ‌ర్ లీగ్ వ‌చ్చేస్తోంది

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన మొహ్సిన్‌ న‌ఖ్వీ..పాకిస్తాన్ కుక్క‌ల‌కు విశ్వాస‌మే లేదుగా !

×