Wasim Akram: టీ20 ప్రపంచ కప్ 2026 ( T20 World Cup 2026 ), ఆసియా కప్ 2025, ఇతర టీ20 ట్రోఫీలను టీమిండియా కు అందించిన సూర్య కుమార్ యాదవ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లాంటి పెద్ద ట్రోఫీని అందించిన సూర్య కుమార్ యాదవ్ ( surya kumar yadav) కెప్టెన్సీ పీకి పారేసింది బీసీసీఐ ( BCCI). వరల్డ్ కప్ తీసుకువచ్చాడు అన్న గౌరవం ఇవ్వకుండా.. తుది జట్టు నుంచి కూడా తొలగించింది. కెప్టెన్ గా సక్సెస్ అవుతున్న సూర్య… ఆటగాడిగా విఫలమవుతూ వస్తున్నాడు. అందుకే అతనిపై వేటు వేసింది. అయితే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ ని తొలగించిన అంశం పైన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ( Wasim Akram) స్పందించారు. ఇండియాలో సూర్య కుమార్ యాదవ్ కు అడుగడుగున అవమానం జరుగుతోందని.. పాకిస్తాన్ లో సూర్య భాయ్ పుట్టి ఉంటే, మరో 20 ఏళ్లు కెప్టెన్ చేసేవాళ్ళమంటూ బాంబు పేల్చారు. వరల్డ్ కప్ తీసుకువచ్చిన వాళ్లను నెత్తిన పెట్టుకొని ఊరేగే వాళ్ళం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ సూర్యను అడుగడుగునా బిసిసిఐ అవమానిస్తోందని ఫైర్ అయ్యారు. దీంతో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీని తొలగించడం పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తీవ్రంగా ఖండించారు. బిసిసిఐ అసలు ఏం చేస్తుందో? అర్థం కావడంలేదని మండిపడ్డారు. టి20 టోర్నమెంటులో టీమిండియాను అగ్రశ్రేణిగా నిలబెట్టిన సూర్య కుమార్ యాదవ్ కి ఇలా అన్యాయం జరిగితే ఎలా అంటూ నిలదీశారు. ఇలాంటోడు పాకిస్తాన్ లో ఉంటే, 20 ఏళ్లు కెప్టెన్సీ ఇచ్చే వాళ్ళమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కనీసం ఐదు సంవత్సరాలైనా పాకిస్తాన్ కెప్టెన్ చేసే వాళ్ళమని ప్రకటించారు వసీం అక్రమ్.
అయితే ఇండియాలో మాత్రం అలా పరిస్థితులు ఉండబోవని వ్యాఖ్యానించారు. సరిగ్గా ఆడితేనే ఆటగాడు తుది జట్టులో ఉంటాడని వెల్లడించారు. వరల్డ్ కప్ తీసుకువచ్చినా, ఆటగాడిగా విఫలమైతే మాత్రం తీసి బయట పాడేస్తారని బిసిసిఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో పర్ఫామెన్స్ మాత్రమే ముఖ్యమని… ట్రోఫీలు పట్టించుకోబోరని స్పష్టం చేశారు. దీంతో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా టీ 20 వరల్డ్ కప్ గెలిపించిన సూర్య కుమార్ యాదవ్ పైన వెయిట్ వేసిన బీసీసీఐ… శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇచ్చింది. ఇకనుంచి టి20 టీమిండియా కెప్టెన్ గా అతడే కొనసాగనున్నాడు.