Not a single Pakistani commentator : వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs Pakistan ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( Pakistan tour of West Indies, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 25వ తేదీన వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంటులో భాగంగా వెస్టిండీస్ తో మొత్తం రెండు టెస్టులు ఆడనుంది పాకిస్తాన్. వెస్టిండీస్ వేదికగానే ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ ( West Indies vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ కు సంబంధించిన ఏ ఒక్క కామెంటేటర్ ( Commentator) కూడా పాల్గొనడం లేదు. పాకిస్తాన్ కామెంట్ కామెంటేటర్ లకు ఎలాంటి ఆహ్వానం ఇవ్వలేదు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. దీంతో పాకిస్తాన్ కు ఘోర అవమానం ఎదురైనట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs Pakistan ) మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. జూలై 25వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఘోర అవమానం ఎదురయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఏ ఒక్క కామెంటేటర్ ( Commentator) ను కూడా ఆహ్వానించలేదు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. కేవలం వెస్టిండీస్, ఇతర దేశాల కామెంటేటర్లను మాత్రమే ఆహ్వానించారు. వాస్తవంగా వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరిగితే ఖచ్చితంగా ఇరు జట్లకు సంబంధించిన కామెంటేటర్లు ( Commentator) ఉండాల్సిందే.
కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పట్ల వెస్టిండీస్ చాలా దౌర్జన్యంగా వ్యవహరించి.. కామెంటేటర్లు లేకుండానే చేసింది. దీనిపై మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ వెధవలకు ఇంగ్లీష్ రాదన్న కారణంతో వెస్టిండీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మరి కొందరు చెబుతున్నారు. ఈ కామెంటేటర్లకు కాకుండా… పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మిగిలిన ప్లేయర్లకు కూడా ఎవరికీ ఇంగ్లీష్ రాదు. ఎక్కడ వీళ్లు ఇంగ్లీష్ మాట్లాడినా.. మరొకరికి అర్థము కాదు. అందుకే పాకిస్తాన్ ప్లేయర్లకు కూడా ఇంగ్లీష్ క్లాసులు నేర్పిస్తోంది పీసీబీ.
వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జులై 25వ తేదీన మొదటి టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఇందులో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో రెండు రోజులపాటు ఆడిన వెస్టిండీస్.. 6 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఇందులో హాడ్జ్ 84 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ షై హోప్ అర్థ సెంచరీ తో రాణించాడు. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వెస్టిండీస్ 400 వరకు పరుగులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.