E-Paper
Advertisement

People Died due to Rain: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??

People Died due to Rain: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??

People died due to Heavy Rain fall: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి భారీగా వచ్చి చేరుతుంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రాయులయ్యారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా పలువురు మృత్యువాతపడ్డారు.

Also Read: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్

రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 16 మంది మృతిచెందారు. వర్షాలు, వరదల కారణంగా వారు మృతిచెందడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.

Also Read: ఖమ్మంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దు. అధికారులంతా క్షేత్రస్థాయిలో నిరంతరం అలర్ట్ గా ఉండి.. పరిస్థితులను సమీక్షిస్తూ ఉండాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్, రహదారులను వెంటనే పునరుద్ధరించాలి. రాష్ట్రా స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తాం. పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేతలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×