BigTV English
Advertisement

People Died due to Rain: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??

People Died due to Rain: ఏ ఏ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా పడింది..? ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారంటే..??

People died due to Heavy Rain fall: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి భారీగా వచ్చి చేరుతుంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రాయులయ్యారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు, వరదల కారణంగా పలువురు మృత్యువాతపడ్డారు.


Also Read: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్

రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను వెల్లడించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తోంది. ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 16 మంది మృతిచెందారు. వర్షాలు, వరదల కారణంగా వారు మృతిచెందడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.


Also Read: ఖమ్మంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దు. అధికారులంతా క్షేత్రస్థాయిలో నిరంతరం అలర్ట్ గా ఉండి.. పరిస్థితులను సమీక్షిస్తూ ఉండాలి. వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్, రహదారులను వెంటనే పునరుద్ధరించాలి. రాష్ట్రా స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తాం. పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేతలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అంటూ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×