E-Paper
Advertisement

Telangana Floods: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్

Telangana Floods: రాజకీయాలకు ఇది సమయం కాదు.. కేంద్రమంత్రులు రావాలి : సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reedy Meeting in Suryapet : తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు భారీగా పంటనష్టం వాటిల్లింది. జిల్లాల వారిగా జరిగిన పంట నష్టం, వరద మిగిల్చిన ఆస్తి, ప్రాణ నష్టాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంటనష్టంపై ఆయన ఆరా తీశారు.

సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాలో వాటిల్లిన పంట, ఆస్తి నష్టం వివరాలపై ప్రాథమిక నివేదిక సమర్పించారు. భారీ వర్షాల సమయంలో జిల్లా యంత్రాంగం, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని సీఎం తెలిపారు. వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని, ఖమ్మం, నల్గొండ పరిస్థితిపై మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీలకు వివరించి సహాయం చేయాలని కోరామన్నారు.

Advertisement

సూర్యాపేట కలెక్టర్ కు తక్షణ సహాయం కింద రూ.5 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పంట నష్టం జరిగిన వారికి ఎకరానికి రూ.10 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులిచ్చే విషయంపై జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Also Read: తెలంగాణలో వరదలు.. మిస్సయిన తండ్రీ-కూతురు బాడీ లభ్యం..

Advertisement

వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఒకరు అమెరికాలో, మరొకరు ఫాంహౌస్ లో ఉండి వర్షాలపై ట్వీట్లు పెడుతున్నారని, ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు తగదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లిన నేతలకు వరద బాధితులను పరామర్శించే తీరక లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీఎంగా తాను మూడురోజులుగా వర్షాలు, వరదలపై సమీక్ష చేస్తున్నానని, మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని తెలిపారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా ఉందన్న సీఎం.. కేంద్రం తక్షణ సహాయం కింద రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. కేంద్రమంత్రులైన కిషన్ రెడ్డి, బండిసంజయ్ లు రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కృషి చేయాలని విన్నవించారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×