E-Paper
Advertisement

Road Accident In Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Road Accident In Warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Road Incident In Warangal: వరంగల్ జిల్లా మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇనుప రాడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో పై స్థంభాలు  పడి ఏడుగురు మృతి చెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై సీఎం రేవంత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద ఇనుప స్థంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పు.. పక్కనే ఉన్న కారు, రెండు ఆటోలపై పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు.. బాలుడు ఉన్నట్లు సమాచారం. ఓ ఆటో డ్రైవర్ కాలు విరిగి విలవిలలాడిపోతున్నాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×