E-Paper
Advertisement

Adilabad Crime: మైనర్ బాలిక కిడ్నాప్.. ఆపై అత్యాచారం.. పోలీసులపై దాడి

Adilabad Crime: మైనర్ బాలిక కిడ్నాప్.. ఆపై అత్యాచారం.. పోలీసులపై దాడి
Advertisement

Adilabad Crime: మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. మూడు గంటలపాటు తన ఇంట్లోనే బంధించాడు నిందుతుడు. ఎంతసేపటికి బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలాబాద్‌లోని గుడిహత్నూర్ మండలంలోని ఓ కాలనీలో పోలీసులు విచారించగా.. పోశెట్టి అనే యువకుడి ఇంటి తలపులు ఎంతసేపు చూసిన తీయకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి.. డోర్ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక చేతులు, కాళ్లు కట్టేసి ఒక రూమ్‌లో బంధించారు. పోశెట్టి మద్యం మత్తులో ఉండటం గుర్తించిన పోలీసులు.. వెంటనే బాలికను బయటకు తీసుకొచ్చారు.

దీంతో విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు పోశెట్టి ఇంటిని చుట్టిముట్టి నిందుతుడికి దేహశుద్ది చేసి, అతని ఇంటికి నిప్పు పెట్టారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా స్థానికులు దాడి చేశారు. దాడిలో రెండు పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు స్వయంగా ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ రంగంలోకి దిగారు. దీంతో గుడిహత్నూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Advertisement

Also Read: వామ్మో.. బయట బిర్యానీ తింటున్నారా..?బీ కేర్‌ఫుల్‌!

వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌లోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు.. దాడికి దిగారు. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. యువకుడి ఇంటిపైకి రాళ్లతో దాడి చేశారు. యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు.

Advertisement

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న .. పోలీసు అధికారులపై కూడా దాడి చేశారు. దీంతో SI, CI కి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Related News

మూసీ మధ్యలో 3 ఎకరాల భూమి కబ్జా.. వారిపై హైడ్రా సైలెంట్ ఎందుకు?

మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్!

KTR, హరీష్‌రావులకు గద్దర్ అవార్డులు గ్యారెంటీ.. మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ సెటైర్లు!

కోదాడ మెగా జాబ్ మేళా.. 300 కంపెనీలు, 4 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్‌ జోన్‌లో ఆ రెండు కులాలు..?

నాగార్జునసాగర్‌లో 200 టీఎంసీల నీరు మాయం.. సర్కార్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్!

ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ!

సెప్టెంబర్ 17 సంఘటన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిందే.. రాంచందర్ రావు డిమాండ్!

Big Stories

Advertisement
×