BigTV English

Siddipet : వరుసగా రెండో రోజు.. సిద్దిపేటలో కల్తీపాల కలకలం..

Siddipet : వరుసగా రెండో రోజు.. సిద్దిపేటలో కల్తీపాల కలకలం..

Siddipet : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల విజయ డైరీలో రెండో రోజు కల్తీ పాల విషయం కలకలం రేపింది. పాల క్యాన్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఉప్పు, చక్కెర కలిపారు. చేర్యాల విజయడైరీ మేనేజర్ పాలని పరీక్షించి వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో మేనేజర్‌తో పాల ఉత్పత్తిదారులు వాగ్వాదానికి దిగారు. పాడి రైతుల ఫిర్యాదుతో విజయ డైరీ మెనజర్ నేరుగా రైతుల వద్దకు వెళ్లారు.


రైతుల వద్ద సేకరించిన పాలను అధికారులు పరీక్షించారు. స్వచ్ఛమైన పాలు అని తెలింది. వెన్న ఎక్కువ వచ్చేందుకు పాల క్యాన్లలో ఉప్పు, చక్కెర కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికైనా పాలు కల్తీ చేస్తున్నవారి తీరు మార్చుకోవాలని విజయ డైరీ మెనజర్ హెచ్చరించారు. కల్తీ అయిన 52 క్యాన్ల పాలను పాడి రైతులు పారబోశారు.

కల్తీ వ్యవహారంపై అధికారులు కన్నెర జేస్తున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండ్‌ ముసుగులో స్వచ్ఛమైన ఆహారాన్ని సైతం కల్తీ చేసేస్తున్నారు. అయితే అధికారులు హెచ్చరించినా పట్టించుకోని కొందరు అక్రమార్కులు.. మరోసారీ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎవరు కల్తీ చేస్తున్నారో త్వరలోనే తేలుస్తామని అధికారులు అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అధికారులు మండిపడ్డారు.


Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×