E-Paper
Advertisement

Thummala Nageswara Rao : సకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేయండి.. మంత్రి తుమ్మల ఆదేశం..

Thummala Nageswara Rao : సకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేయండి.. మంత్రి తుమ్మల ఆదేశం..

Thummala Nageswara Rao : రైతులకు విత్తన సరఫరా, తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి పై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నత అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. వ్యవసాయ శాఖ, విత్తన ధ్రువీకరణ సంస్థ , విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వచ్చే సీజన్ లో రైతులకు విత్తన సరఫరాపై మంత్రి తుమ్మల అధికారుల సమీక్ష చేశారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న విత్తనాల సరఫరాపై చర్చించారు. అదేవిధంగా రైతులకు విత్తనాల విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విత్తన సరఫరా విషయంలో తెలంగాణ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విత్తన కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నకిలీ విత్తనాల సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశంచేశారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలే తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తుమ్మల తెలిపారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×