Aliabad Municipality: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: చైర్మన్గా శిరీష కృష్ణారెడ్డి ఎన్నిక వైస్ చైర్మన్గా మాలతి మాధవ రెడ్డి ఏకగ్రీవం అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చైర్మన్ పదవిని కైవసం చేసుకుంది.మున్సిపాలిటీలో కాంగ్రెస్కు 8 వార్డులు, బీఆర్ఎస్కు 7 వార్డులు, బీజేపీకి 3 వార్డులు, ఇండిపెండెంట్కు 1 వార్డు, బీఎస్పీకి 1 వార్డు ఉన్నాయి. చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ, ఇండిపెండెంట్, బీఎస్పీ మద్దతు లభించడంతో మొత్తం 13 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీష కృష్ణారెడ్డి పేరును 10వ వార్డు కౌన్సిలర్ వనజ ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి బలపరిచారు. జరిగిన ఎన్నికలో శిరీష కృష్ణారెడ్డికు 13 ఓట్లు లభించి చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి బీజేపీ అభ్యర్థి మాలతి మాధవ రెడ్డి పేరును 6వ వార్డు కౌన్సిలర్ గణేష్ ప్రతిపాదించగా, 15వ వార్డు కౌన్సిలర్ స్వప్న బలపరిచారు. ప్రత్యర్థులు లేకపోవడంతో మాలతి మాధవ రెడ్డి ఏకగ్రీవంగా వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు.దీంతో అలియాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి, వైస్ చైర్మన్ పదవి బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
Also Read: Wardhannapet Municipality: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కీలక మలుపు.. చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం