Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వల్ప ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ నుండి గంభీరావుపేటకు ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణంలో ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కాన్వాయ్ వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అయితే, అదృష్టవశాత్తూ బండి సంజయ్తో పాటు వాహనాల్లో ఉన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై కాన్వాయ్ను పరిశీలించారు. అనంతరం బండి సంజయ్ వేరే వాహనంలో తన పర్యటనను కొనసాగించారు.
Also Read: లోకల్ వార్పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!