E-Paper
Advertisement

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!
Advertisement

Adilabad Theft: ఆదిలాబాద్ జిల్లాలో బంగ్లాదేశ్ దేశానికి చెందిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు మహమ్మద్ జానీ అలీ, మహమ్మద్ రుమాన్ అలీ అనే వ్యక్తులు బంగ్లాదేశియులుగా తెలిపారు. వీరిలో మరో నిందితుడు తరుణ్ సింగ్ అనే వ్యకత్తి భారత దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

వీధుల్లో కుక్కర్లు అమ్ముతూ..

ఈ ముఠా అంతాకలిసి గత 9 సంవత్సరాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసుల ఎంక్వైరీలొ తేలింది. ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు భారతదేశంలో అక్రమంగా చొరబడి, నకిలీ ఆధార్ కార్డులను సృష్టించుకున్నట్లు పోలీసులు తెలిపారు. పగటిపూట వీధుల్లో కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ రెక్కీ నిర్వహించి, రాత్రి పూట స్కెచ్ ఎసీ మరీ చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: చేతికి అదిరిపోయే లుక్! రూ.1,899కే నాయిస్ రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్

గతంలో 8 కేసులు..

వీరిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 8 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా ఆదిలాబాద్ నియోజవర్గ ఇంచార్జి అయిన కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగింది. దీంతో చోరీ కేసు దర్యాప్తులో పోలీసుల చేతికి ఈ ముఠా చిక్కింది. వీరు చోరీ చేసిన సొత్తు 8 లక్షల విలువ చేసే 73 గ్రాముల బంగారం,151 గ్రాముల వెండి, ఐఫోన్ లు, ద్విచక్ర వాహనం, ఐప్యాడ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Also Read: తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్.. గౌరీ ప్రియా కామెంట్స్ వైరల్ !

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×