E-Paper
Advertisement

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. మరో విద్యార్థి ఆత్మహత్య

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. మరో విద్యార్థి ఆత్మహత్య

Student Suicide in Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. పీయూసీ సెకండియర్ చదువుతున్న మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట జిల్లాకు చెందిన పి. అరవింద్ మంగళవారం ఉదయం హాస్టల్ గదిలో విగతజీవుడై కనిపించడంతో.. తోటి విద్యార్థులు షాకయ్యారు. వెంటనే హాస్టల్, కాలేజీ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. కాలేజీ యాజమాన్యం సమాచారంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు అరవింద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టంకు తరలించారు.

Also Read : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని సూసైడ్!

మృతుడు బుచ్చా అరవింద్ స్వస్థలం సిద్ధిపేట జిల్లా బందర్ పల్లి. అరవింద్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారమిచ్చారు. అరవింద్ చదువు ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్నాడా ? ఇతర కారణాలేవైనా ఉన్నాయా ? సూసైడ్ కు ముందు నోట్ ఏమైనా రాశాడా ? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కాగా.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చదువు ఒత్తిడి భరించలేక పలువురు విద్యార్థులు హాస్టల్ లోనే సూసైడ్ చేసుకున్నారు.

ఇటీవల ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోనూ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రెండు నెలలుగా మానసిక వేదనతో ఉన్న ఆమె.. తన చావుకెవరూ బాధ్యులు కాదని నోట్ రాసి సూసైడ్ చేసుకుంది.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×