Idupulapaya IIIT Student Death: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న సురేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకిన సురేఖ తీవ్రంగా గాయపడింది. హాస్టల్ సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి.. కడప రిమ్స్ కు తరలించారు.
రిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేఖ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మృతి చెందింది. మృతురాలు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. సురేఖ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బీటెక్ పూర్తిచేసి.. ఉద్యోగం చేయాల్సిన కూతురు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. సురేఖ ఆత్మహత్యకు చదువు ఒత్తిడే కారణమా ? లేక వేరే ఏవైనా కారణాలున్నాయా ? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.