E-Paper
Advertisement

Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని సూసైడ్!

Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని సూసైడ్!
Advertisement

Idupulapaya IIIT Student Death: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన జరిగింది. కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న సురేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకిన సురేఖ తీవ్రంగా గాయపడింది. హాస్టల్ సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి.. కడప రిమ్స్ కు తరలించారు.

రిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేఖ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మృతి చెందింది. మృతురాలు ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. సురేఖ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బీటెక్ పూర్తిచేసి.. ఉద్యోగం చేయాల్సిన కూతురు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. సురేఖ ఆత్మహత్యకు చదువు ఒత్తిడే కారణమా ? లేక వేరే ఏవైనా కారణాలున్నాయా ? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×