E-Paper
Advertisement

Minister Seethakka: ఇదే సరైన సమయం, ఆ పార్టీని నిలదీయండి-సీతక్క

Minister Seethakka: ఇదే సరైన సమయం, ఆ పార్టీని నిలదీయండి-సీతక్క
Advertisement

Minister Seethakka: సమ్మర్ సీజన్ ఏమోగానీ.. అప్పుడే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కులగణన నివేదిక తర్వాత అధికార పార్టీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడానికి బీసీ సమాజానికి ఇదే సరైన సమయమన్నారు. కులగణనలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు ఆ అంశంపై మాట్లాడే హక్కు కోల్పోయారని అన్నారు. ఆ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదని, కనీసం నియోజకవర్గంలో ప్రజలైనా ఇందులో పాల్గొవాలని ఎక్కడా చెప్పిన సందర్భం లేదన్నారు.

బీఆర్ఎస్ హయాంలో సీఎం, పార్టీ అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. నరేంద్ర నుంచి రాజేంద్ర వరకు ఎదిగిన బీసీ నేతలను అవమానించి పార్టీ నుంచి బయటకు పంపించలేదా అంటూ మండిపడ్డారు. రెండు దశాబ్దాలుగా బీసీ వర్గాన్ని అణగ తొక్కేసిందన్నారు.

Advertisement

కేసీఆర్ హయాంలో రుణమాఫీ కానీ ఎంతో మంది రైతులు, ప్రస్తుతం రుణాల మాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లో రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇల్లు ఇచ్చిన సందర్భం లేదన్నారు.

ఇక రేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావించకుండా దశాబ్దంపాటు రూలింగ్ చేసిందన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని లబ్దిదారులు దరఖాస్తు పెట్టిన సందర్భాన్ని వివరించారు. ప్రభుత్వ పథకాలు అనేవి నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

ALSO READ:  పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్, మున్షీ భేటీ.. ‘స్థానిక’పై ఓ కొలిక్కి

ప్రస్తుతం భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. ఆనాడు బీఆర్ఎస్ సరిగా రుణమాఫీ చేయకపోవడం వల్లే, దాని బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు. ప్రస్తుతం భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. ఆనాడు బీఆర్ఎస్ సరిగా రుణమాఫీ చేయకపోవడం వల్లే, ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై పడిందన్నారు.

 

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×