E-Paper
Advertisement

Bhadradri District: అక్షరాల రూ.98లక్షల విలువైన గంజాయి.. కంటైనర్‌లో తీసుకెళ్తుండగా, పోలీసులు ఎంటర్..!

Bhadradri District: అక్షరాల రూ.98లక్షల విలువైన గంజాయి.. కంటైనర్‌లో తీసుకెళ్తుండగా, పోలీసులు ఎంటర్..!
Advertisement

Bhadradri District:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేట–ఖమ్మం నేషనల్ హైవేపై అచ్యుతాపురం స్టేజి వద్ద జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ కీలక పట్టుబాటు జరిగింది. అనుమానాస్పదంగా కనిపించిన తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న డీసీఎం కంటైనర్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, లోపల భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు.

వాహనం క్యాబిన్‌లో ప్రత్యేకంగా సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేసి, అత్యంత చాకచక్యంగా సుమారు 200 కేజీల గంజాయిని దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.98 లక్షల వరకు విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Advertisement

ప్రాథమిక విచారణలో ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడులోని చెన్నైకి అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయితో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎం కంటైనర్‌తో పాటు ఎస్కార్ట్‌గా ఉపయోగించిన కార్లను కూడా సీజ్ చేశారు.

నిందితులు గంజాయి రవాణా కోసం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీలను తప్పించుకునేందుకు సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేయడంతో పాటు ఎస్కార్ట్ వాహనాలను ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ పట్టుబాటు జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై పెద్ద దెబ్బగా పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×