E-Paper
Advertisement

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు
Advertisement

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్‌ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్రను రాహుల్ ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా క్రికెట్‌ ఆడారు. పాఠశాల విద్యార్థులతో చేతులు కలిపి పాదయాత్ర కొనసాగించారు. నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు సంప్రదాయ వేషధారణలో రాహుల్‌కు స్వాగతం పలికారు. రాహుల్‌ వెంట ఏఐసీసీ నేతలు బోసురాజు, దిగ్విజయ్‌ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. దివ్యాంగులకు రాహుల్‌ చేతుల మీదుగా వీల్‌ఛైర్లను అందజేశారు. రామ్‌మందిరం సమీపంలో ఇందిరాగాంధీ కుటుంబంపై ఏర్పాటు చేసి ఫొటో ఎగ్జిబిషన్‌ను రాహుల్‌ తిలకించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్‌ కొట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×