Bhatti Vikramarka: నేడు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్లో విద్యుత్ ప్రెజెంటేషన్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో 47 ప్రాధాన్య అంశాలను 12 డిపార్ట్మెంట్ల నుంచి పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చర్చించారు. “కాంగ్రెస్ అంటే విద్యుత్, విద్యుత్ అంటే కాంగ్రెస్” అని ఆయన గత పబ్లిక్ మీటింగ్లో చెప్పినట్లుగానే, ఈ ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టారు.
అంతేకాకుండా ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్రానికి ఉపయోగపడతుంది. ప్రతి ఉత్పత్తి రంగానికి ఒక గ్రిప్ అందిస్తేనే ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా సోలార్, థర్మల్, విండ్ పవర్ స్టోరేజీలో మనం వెనకబడి ఉన్నాం అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచుకోకుంటే భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయి. అందుకే కావాల్సిన పెట్టుబడులకు విద్యుత్ కావాలి.
Also Read: గాల్లో ప్రాణాలు.. ఆకాశంలో, 150 అడుగుల ఎత్తులో చిక్కుకున్న కుటుంబం
కావున డేటా సెంటర్లో హైదరాబాద్ గ్లోబల్ హబ్గా మారబోతోంది అని చెప్పారు. ఓవరాల్గా 8. 50 గ్రోత్ ఉండబోతుందన్నారు. అలాగే 2047 నాటికి లక్షా 39 వేలు మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ప్రస్తుతం వాడే విద్యుత్లో 50 శాతం గ్రీన్ ఎనర్జీ వాడాలన్నారు. 2026 ఏప్రిల్ నాటికి 24, 769 మెగావాట్ల కరెంట్ అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.. 2047 వరకు 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవాలన్నదే మా లక్ష్యం.. తెలంగాణను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే మా ఆలోచన అని చెప్పారు.