Bhoodan Land Scam: స్వేచ్చ బ్యూరో: యూసిసీఆర్ఎల్ (యంఎల్) ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారంతో మోసం చేసి వెలుగుమట్ల నిరుపేద బాధితుల నుంచి రూ. 3 కోట్లు వసూళ్ళకు పాల్పడ్డారని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాదరావు తెలిపారు. మేరకు భూదాన్ యజ్ఞ బోర్డు లెర్నీడ్ స్టాండింగ్ కౌన్సిల్ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులుగా వెలుగు చూశాయని తెలిపారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేసినట్లు, చట్టపరమైన చర్యలు కొనసాగుతు న్నాయని అన్నారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.
నిందితులంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి అమాయక ప్రజలను ప్రేరేపించి, వారికి ఆశపెట్టి, భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తామని నిరుపేద భాదితుల ఒక్కొ క్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లు చేశారని చెప్పారు. నిందితులు చర్యలవల్ల అనేక మంది పేదలు నిలువునా మోసపోయారని, భూదాన్ కాలనీ సభ్యుల నుంచి వసూల్ చేసిన డబ్బును వారి స్వప్రయోజనాలకు వాడుకుని, ప్రశ్నించిన వారికి భూదాన్ పట్టాలు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని నమ్మబలికారని ఆయన పేర్కోన్నారు. ఈ ముఠా సభ్యులపై గతంలో సుమారు15 కేసులు నమోదు అయినట్టు తెలిపారు.
Also Read: Agriculture Drones: అన్నదాతలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు!
ఈ కేసులో దర్యాప్తు క్షేత్రస్థాయిలో కొనసాగుతోందని, ఎవరైనా బాధితులు మోస పోయినట్లయితే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెలుగుమట్ల భూదాన్ బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుండి రికవరీ చేసి తిరిగి భాదితులకు అప్పగిస్తామని అన్నారు. భూదాన్ భూముల్లో అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులపై ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ తో పాటు సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్ కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
తాజాగా అరెస్ట్ అయిన నిందుతుల్లో కొప్పెర వెంకన్న 42 సం, నామవరం, మోతెమండలం, సూర్యాపేట, కొట్టే బసు, 39 సం, వెలుగుమట్ల, ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామం. సంపంగి వెంకటాచలం 43 సం,గోపాలపురం,బల్లి శ్రీనివాసరావు, 45సం, వినోభా నవోదయ కాలనీ బురద రాఘవపురం ఏన్కూరు మండలం, తాళ్లూరి కృష్ణ 50 సం, కవిరాజునగర్, వినోభా నవోదయ కాలనీ, వెలుగుమట్ల,బుడిగె రాములు వెలుగుమట్ల ఖమ్మం అర్బన్, మంకిడి లింగరాజు, 66సం, లచ్చగూడెం, ఏన్కూరు మండలం, వినోభా నవోదయ కాలనీ, వెలుగుమట్ల. రాచకొండ నరసింహా చారి సహకారనగర్, భూదాన్ కాలనీ, వెలుగుమట్ల, దండా లింగయ్య 50సం, బోసు బొమ్మ సెంటర్ లు ఉన్నారు.
Also Read: Shreya Ghoshal: అసలు అమ్మాయిలు ఎక్కడున్నారు.. ఉమెన్స్ డే రోజు వైరల్ అవుతున్న శ్రేయ ఘోషల్ ఆవేదన..!