BigTV English

Bhupalpally: ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్

Bhupalpally: ప్రిన్సిపాల్ మీద కోపంతో మంచినీళ్ల ట్యాంక్‌లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్

Bhupalpally: రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.. ఈ ఘటనలో 10 మంది విద్యార్థినులకు అస్వస్థతగా ఉందని తెలిపారు. అయితే గతంలో ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే ఇప్పుడు కూడా మళ్లీ అదే స్కూళ్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది.


పురుగుల మందు కలిపిన నీళ్లు తాగి విద్యార్ధులకు అస్వస్థత..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొరిశాల కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో 10 మంది విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో నిన్న రాత్రి భోజనం తర్వాత ఆరుగురు, ఈరోజు ఉదయం నలుగురు విద్యార్థులకు అస్వస్థతగా మారింది. అయితే ఈ విషయం ఎవరికి తెలియకుండా.. విద్యార్థులను ఎవరు కలవకుండా.. స్కూల్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు..

ప్రిన్సిపల్ మీద కోపంతో ట్యాంక్‌లో పురుగుల మందు..
అయితే ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అదే స్కూ్ల్లో చేస్తున్న సైన్స్ టీచర్ ప్రిన్సిపల్ మీద కోపంతో ఏకంగా వాటర్ ట్యాంక్‌లోనే పురుగుల మందు కలిపాడు. ఈ విషయం తెలయని పాపం చిన్నారులు నిన్న పురుగుల మందు కలిపిన నీళ్ల తాగి పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రస్తుతం వారందరికి చికిత్స జరుగుతుంది.


టీచర్ రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..
అయితే ఈ ఘటన జరిగిన తర్వాత టీచర్ రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయించాలని కుట్రతోనే.. సైన్స్ టీచర్ రాజేందర్ వాటర్ ట్యాంక్‌లో పురుగుల మందు కలిపాడని తెలుస్తుంది.

Also Read: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

ఏది ఏమైనప్పటికి టీచర్స్ మీద కోపం ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి.. కానీ, అలా పురుగుల మందు మొత్తం వాటర్ ట్యాంక్‌లో కలిపితే చిన్నారులు తాగుతారు.. వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆ మాత్రం తెలియకుండా ఉండకపోవడం చాలా విషాదకరంగా ఉంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఏఐసీసీ ప్రకటన

Telangana Digital Connectivity: గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ రోల్ మోడల్

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్ల కేసు ఖచ్చితంగా గెలుస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

Telangana RTC: హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు.. జిల్లా బస్సుల్లో కూడా బాదుడు.! టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ

BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా

Weather Update: రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం, అత్యవసరం అయితే తప్ప..?

Cough Syrups: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్

Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..

Big Stories

×