E-Paper
Advertisement

Aarogyasri Services: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బ్యాడ్ న్యూస్.. మరోసారి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్

Aarogyasri Services: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బ్యాడ్ న్యూస్.. మరోసారి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్
Advertisement

Aarogyasri Services: తెలంగాణలో మరోసారి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్ పడింది. రేపు రాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత కొద్ది కాలం నుంచి ప్రభుత్వం చెల్లించండం లేదు. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదని  ప్రవైట్ హాస్పిటల్స్ వాపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణలో పేదలు, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడం ఒక ఆందోళనకరమైన విషయమని చెప్పవచ్చు. ఆరోగ్యశ్రీ అనేది పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే ప్రభుత్వ పథకం. ఈ స్కీం లక్షలాది మంది నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. హార్ట్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వంటి ఖరీదైన వైద్య సేవలను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తుంది. కానీ ఇటీవలి కాలంలో ఈ పథకం సమస్యలతో కొన్ని సతమతమవుతోంది.

Advertisement

సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు వేట్ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.  ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు ఏడాది కాలంగా ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిబ్బంది జీతాలు, మెడికల్ సామగ్రి కొనుగోలు వంటివి కష్టమవుతున్నాయి. దీంతో, సేవలు కొనసాగించలేకపోతున్నామని ఆసుపత్రి యాజమానులు చెబుతున్నాయి.

ALSO READ: Weather News: మళ్లీ కుండపోత వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Advertisement

ఆరోగ్య సేవలకు బ్రేక్ పడడం ఇదే తొలిసారి కాదు. జనవరి నెలలో కూడా ఇలాంటి సమస్యలతో సేవలు నిలిచిపోయాయి. అప్పుడు ఆరోగ్య మంత్రి జోక్యం చేసుకుని, ఫైనాన్స్ మంత్రితో చర్చలు జరిపి, డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీలు నెరవేరలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సమస్యలను ఎత్తిచూపుతూ, మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎమ్‌ఓయూ) సవరణ, ప్యాకేజీల రివిజన్, రెగ్యులర్ పేమెంట్లు వంటి డిమాండ్లు చేస్తోంది.

ALSO READ: DSSSB: ఇంటర్ అర్హతతో భారీగా జాబ్స్.. తక్కువ పోటీ.. వెంటనే అప్లై చేయండి బ్రో

ఈ ఆరోగ్య శ్రీ పథకం నిలిపివేత వల్ల ప్రభావితమయ్యేది పేద ప్రజలే. రాష్ట్రంలో దాదాపు 400 ఆసుపత్రుల్లో సేవలు ఆగిపోతాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స పొందాల్సి వస్తుంది. అక్కడ సౌకర్యాలు పరిమితంగా మాత్రమే ఉంటాయి. ఇది ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది. ప్రజలు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతునన్నారు. బకాయిలు చెల్లించి, ఆసుపత్రులతో చర్చలు జరిపి, పథకాన్ని సజావుగా నడిపించాలని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్ పడడం త్వరలోనే ముగుస్తుందని ఆశిద్దాం.

ఏపీలోనూ ఆరోగ్య సేవలకు బ్రేక్..

అటు ఏపీలోనూ ఆరోగ్య సేవలకు బ్రేక్ పడింది. ఈ రోజు నుంచి ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేట్ ఆస్ప్రత్రులకు ఏపీ ప్రభుత్వం రూ.2వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని ఆశా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×