Big Stories

The Helipad Story: బిగ్ టీవి నేకెడ్ ట్రూత్.. ది హెలిప్యాడ్ స్టోరీ..!

The Helipad Story by Big Tv:ఒక వైపు అమెరికన్ కాన్సులేట్.. మరోవైపు మైక్రోసాఫ్ట్.. చుట్టూ ఖరీదైన బంగ్లాలు.. మధ్యలో ఎనిమిది ఎకరాల ల్యాండ్. అది బోయినపల్లి శ్రీనివాస్ రావు పేరున ఉంది. దాన్ని అతను హైదరాబాద్ ఎయిర్ లైన్స్‌కు లీజుకి ఇచ్చాడు. అది కూడ అతని కంపెనీనే. ఇంతకీ అతను ఎవరంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్‌కు స్వయానా సోదరుడు. ప్రతిమ గ్రూప్ ఓనరే ఈ బోయినపల్లి శ్రీనివాస్ రావు. బీఆర్ఎస్ పాలనలో బోయినపల్లి కుటుంబం హవా నడిపించింది.

- Advertisement -

ఇదంతా ఎందుకంటే ఇంత ఖరీదైన ఏరియాలో శ్రీనివాసరావు గజం ఎంతకు కొన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంత ఖరీదైన ఏరియాలో గజం కేవలం రూ. 4340 కు కొన్నారు. సరిగ్గా ఏడాది క్రితం బోయినపల్లి శ్రీనివాస్ రావు ఈ భూమిని కొనుగోలు చేశారు. ఎనిమిది ఎకరాల ఏడు గుంటలకు గాను సొసైటీ అకౌంట్‌కు శ్రీనివాస్ రావు 17 కోట్ల మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. అంటే గజం భూమిని రూ. 4340 కి కొన్నారన్నమాట. ప్రస్తుతం అక్కడ గజం లక్షన్నరకు పైగా పలుకుతుంది. కనీసం లక్ష వేసుకున్న దాదాపు ఎకరాకు 48 కోట్లు రావాలి. ఈ లెక్కన 8 ఎకరాల మొత్తం విలువ 600 కోట్ల పైమాటే. కానీ శ్రీనివాస్ రావు దాన్ని దక్కించుకుంది కేవలం 17 కోట్ల 16 లక్షల 75 వేల రూపాయలకే. దీనికి సంభందించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

- Advertisement -

Also Read: Fighting between Ysrcp vs Tdp cadre: కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు, ఏం జరుగుతుందోనని..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News