E-Paper
Advertisement

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!

BJP Corporator: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్​ నగర పాలక సంస్థ పరిధిలోని ఓ బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదైంది. నగరంలోని లలితానగర్​కు చెందిన బిల్డర్​ గడ్డం ప్రసాద్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక బీజేపీ కార్పొరేటర్​ మఠం పవన్​పై ఐదో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​ నం. 62/2026, బీఎన్​ఎస్​ సెక్షన్​ 308(1) కింద కేసు నమోదు చేస్తూ ఈ నెల 6న ఎఫ్​ఐఆర్​ జారీ అయ్యింది.

డబ్బులు డిమాండ్..

ఎఫ్​ఐఆర్​లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు గడ్డం ప్రసాద్​ గత ఏడు సంవత్సరాలు బిల్డర్​గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అయోధ్యనగర్​లో వంద గజాల స్థలంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. కాగా.. సంబంధిత ఇల్లు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్​ మఠం పవన్​, అతని అనుచరుడు వినోద్​ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్​ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటి పనులు నిలిపివేయిస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో విచారణ జరిపిన ఐదో టౌన్​ పోలీసులు మఠం పవన్​తో పాటు అతని అనుచరుడు వినోద్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?

బీజేపీ కార్పొరేటర్​ పై కేసు నమోదు

నిజామాబాద్​ నగర పాలక సంస్థ పాలకవర్గం ఇటీవలే కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలి సమావేశం జరిగి కూడా నెల రోజులు కాలేదు. అప్పుడే కార్పొరేటర్ల వసూళ్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదు కావడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×