E-Paper
Advertisement

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!
Advertisement

BJP Corporator: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్​ నగర పాలక సంస్థ పరిధిలోని ఓ బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదైంది. నగరంలోని లలితానగర్​కు చెందిన బిల్డర్​ గడ్డం ప్రసాద్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక బీజేపీ కార్పొరేటర్​ మఠం పవన్​పై ఐదో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​ నం. 62/2026, బీఎన్​ఎస్​ సెక్షన్​ 308(1) కింద కేసు నమోదు చేస్తూ ఈ నెల 6న ఎఫ్​ఐఆర్​ జారీ అయ్యింది.

డబ్బులు డిమాండ్..

ఎఫ్​ఐఆర్​లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు గడ్డం ప్రసాద్​ గత ఏడు సంవత్సరాలు బిల్డర్​గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అయోధ్యనగర్​లో వంద గజాల స్థలంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. కాగా.. సంబంధిత ఇల్లు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్​ మఠం పవన్​, అతని అనుచరుడు వినోద్​ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్​ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటి పనులు నిలిపివేయిస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో విచారణ జరిపిన ఐదో టౌన్​ పోలీసులు మఠం పవన్​తో పాటు అతని అనుచరుడు వినోద్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also read: హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?

బీజేపీ కార్పొరేటర్​ పై కేసు నమోదు

నిజామాబాద్​ నగర పాలక సంస్థ పాలకవర్గం ఇటీవలే కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలి సమావేశం జరిగి కూడా నెల రోజులు కాలేదు. అప్పుడే కార్పొరేటర్ల వసూళ్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదు కావడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Also Read: పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×