BJP Corporator: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓ బీజేపీ కార్పొరేటర్పై కేసు నమోదైంది. నగరంలోని లలితానగర్కు చెందిన బిల్డర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్పై ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నం. 62/2026, బీఎన్ఎస్ సెక్షన్ 308(1) కింద కేసు నమోదు చేస్తూ ఈ నెల 6న ఎఫ్ఐఆర్ జారీ అయ్యింది.
ఎఫ్ఐఆర్లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు గడ్డం ప్రసాద్ గత ఏడు సంవత్సరాలు బిల్డర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అయోధ్యనగర్లో వంద గజాల స్థలంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. కాగా.. సంబంధిత ఇల్లు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్ మఠం పవన్, అతని అనుచరుడు వినోద్ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటి పనులు నిలిపివేయిస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో విచారణ జరిపిన ఐదో టౌన్ పోలీసులు మఠం పవన్తో పాటు అతని అనుచరుడు వినోద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read: హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?
నిజామాబాద్ నగర పాలక సంస్థ పాలకవర్గం ఇటీవలే కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలి సమావేశం జరిగి కూడా నెల రోజులు కాలేదు. అప్పుడే కార్పొరేటర్ల వసూళ్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ కార్పొరేటర్పై కేసు నమోదు కావడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?