E-Paper
Advertisement

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!

బిల్డర్‌ని బెదిరించి బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా..!
Advertisement

BJP Corporator: స్వేచ్ఛ బ్యూరో: నిజామాబాద్​ నగర పాలక సంస్థ పరిధిలోని ఓ బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదైంది. నగరంలోని లలితానగర్​కు చెందిన బిల్డర్​ గడ్డం ప్రసాద్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక బీజేపీ కార్పొరేటర్​ మఠం పవన్​పై ఐదో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్​ఐఆర్​ నం. 62/2026, బీఎన్​ఎస్​ సెక్షన్​ 308(1) కింద కేసు నమోదు చేస్తూ ఈ నెల 6న ఎఫ్​ఐఆర్​ జారీ అయ్యింది.

డబ్బులు డిమాండ్..

ఎఫ్​ఐఆర్​లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు గడ్డం ప్రసాద్​ గత ఏడు సంవత్సరాలు బిల్డర్​గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అయోధ్యనగర్​లో వంద గజాల స్థలంలో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. కాగా.. సంబంధిత ఇల్లు నిర్మాణానికి సంబంధించి మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్​ మఠం పవన్​, అతని అనుచరుడు వినోద్​ 15 రోజుల క్రితం తనను డబ్బులు డిమాండ్​ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటి పనులు నిలిపివేయిస్తామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో విచారణ జరిపిన ఐదో టౌన్​ పోలీసులు మఠం పవన్​తో పాటు అతని అనుచరుడు వినోద్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also read: హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?

బీజేపీ కార్పొరేటర్​ పై కేసు నమోదు

నిజామాబాద్​ నగర పాలక సంస్థ పాలకవర్గం ఇటీవలే కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలి సమావేశం జరిగి కూడా నెల రోజులు కాలేదు. అప్పుడే కార్పొరేటర్ల వసూళ్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ కార్పొరేటర్​పై కేసు నమోదు కావడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Also Read: పెద్ద మనుసు చాటుకున్న ఎంపీ మల్లు రవి.. ఏం చేశారంటే..?

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×