E-Paper
Advertisement

బండి కొడుకు వ్యవహారం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు

బండి కొడుకు వ్యవహారం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
Advertisement

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణలకు అలాగే భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయమని దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఈ కేసు విచారణ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రామచందర్ రావు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం దర్యాప్తు జరగాలని పేర్కొంటూనే.. బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై అనుమానాలు ఉంటే విచారణ జరిపించుకోవచ్చని స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునే ప్రక్రియలో పార్టీ జోక్యం ఉండదని వెల్లడించారు.

Advertisement

రాజకీయంగా ఈ అంశాన్ని పార్టీకి ముడిపెట్టడం సమంజసం కాదని ఆయన పునరుద్ఘాటించారు. ఒక వ్యక్తిపై నమోదైన కేసును పార్టీకి ఆపాదించడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి నిజానిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ALSO READ: తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×