BigTV English
Advertisement

Bowenpally Incident: మహాత్మా మన్నించు.. బాపూజీ విగ్రహం నోటిలో క్రాకర్స్ పేల్చివేత.. ఆకతాయిల భరతం పట్టాలని డిమాండ్స్

Bowenpally Incident: మహాత్మా మన్నించు.. బాపూజీ విగ్రహం నోటిలో క్రాకర్స్ పేల్చివేత.. ఆకతాయిల భరతం పట్టాలని డిమాండ్స్

Bowenpally Incident: ఆకతాయి పనులకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులు దాటితే, ఏనాటికైనా తిప్పలు తప్పవు. అందుకే నేటి యువత కొంత ఆకతాయి పనులకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాలి. మనం చేసే కొన్ని ఆకతాయి పనులు, సభ్యసమాజం ఛీ కొట్టేలా కూడా ఉండకూడదు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ పరిధిలో జరిగింది. అది కూడా దీపావళి పండుగ రోజు. ఇంతకు ఏమి జరిగిందంటే?


సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గల బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన దీపావళి రోజు జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోయిన్ పల్లి పరిధిలో మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే దీపావళి రోజు కొందరు యువకులు, మహాత్ముని విగ్రహం సమీపంలో క్రాకర్స్ కాల్చేందుకు వచ్చారు. అక్కడ క్రాకర్స్ కాల్చడం వరకు ఓకే గానీ, ఇక్కడే వారు చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వారిలో కొందరు ఆకతాయిలు, లక్ష్మీ బాంబును మహాత్ముని నోటిలో ఉంచి పేల్చారు. అలా పేల్చి నవ్వుతూ కేకలు కూడా వేయడం ఆ వీడియోలలో స్పష్టంగా వినిపిస్తోంది. అయితే ఈ దృశ్యాలను ఎవరో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనే నీతి బోధ చేసిన మహాత్ముని విగ్రహం పట్ల ఆకతాయిలు వ్యవహరించిన తీరుతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


స్వాతంత్ర్య సంగ్రామంలో శాంతి, అహింస అనే ఆయుధాలతో పోరాడి, నేటి మన స్వేచ్ఛ జీవితానికి కారకులైన మహనీయుడి విగ్రహం పట్ల ఆకతాయిలు ప్రవర్తించిన తీరుపై పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన, కారకులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అలాగే సీపీ సివి ఆనంద్ సుమోటోగా ఈ కేసును స్వీకరించి, చట్టప్రకారం వారిని శిక్షించాలని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ డిమాండ్ చేశారు.

Also Read: Biker Arrested: టపాసులతో బైక్ స్టంట్స్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో.. వారిని ఏం చేశారో తెలుసా?

ఏదిఏమైనా తమ బాల్యంలో గురువులు చెప్పిన మహనీయుని చరిత్ర పాఠాలు మరచిపోయారో ఏమో గానీ, సాక్షాత్తు బాపూజీ విగ్రహం పట్ల ఆకతాయిలు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని చెప్పవచ్చు. ఇలాంటి వారిని వదిలిపెట్టకుండా, చట్టరీత్యా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×