E-Paper
Advertisement

MP Chamala Kiran Kumar Reddy : బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Chamala Kiran Kumar Reddy : బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

MP Chamala Kiran Kumar Reddy :

⦿ ఎక్స్‌లో నిత్యం తప్పుడు ప్రచారాలే
⦿ ఎలన్ మస్క్ నుంచి బీఆర్ఎస్‌కు అవార్డ్ ఖాయం
⦿ గులాబీ పార్టీ పని అయిపోయింది
⦿ దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్
⦿ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసే బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు
⦿ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ : నిత్యం ఏదో ఒక విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆదివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన రిప్లయ్ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సీఎం క్లుప్తంగా వివరించారని చెప్పారు. అయితే, రెండోసారి మోదీ రిప్లయ్ ఇచ్చి డిలీట్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. బీజేపీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు. ఆయనకు కనీసం పార్టీ కార్యాలయంలో సొంత గది కూడా లేదని సెటైర్లు వేశారు. ఇక, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆ పార్టీలో ఉద్యోగ నోటిఫికేషన్ వేశారని, బావ, బావమరిది మధ్య పోటీ జరుగుతోందని విమర్శించారు.

2004లో రబ్బర్ చెప్పులతో తిరిగిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే మంత్రి అయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలతో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పోటీ పడుతోందని మండిపడ్డారు. ఎలన్ మస్క్ నుంచి అవార్డు వస్తుందని ఎద్దేవా చేశారు. 10 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో వివరాలతో సహా తెలియజేస్తామని, తమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు చామల. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల వారు తమ హయాంలో సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. మూసీ పునరుజ్జీవంతో అక్కడి రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు నిరంకుశ, దౌర్భాగ్య పాలనను తరిమికొట్టి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. అయినా, లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు ఎలా గెలుస్తుందని సెటైర్లు వేశారు. అసలు, ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అంటూ మాట్లాడారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

Advertisement

ALSO READ : టపాసులతో బైక్ స్టంట్స్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో.. వారిని ఏం చేశారో తెలుసా?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×