Big Stories

TPCC : బాక్సర్ నిఖత్ జరీన్ కు టీపీసీసీ సన్మానం.. డీఎస్పీ పోస్టు ఇవ్వాలని రేవంత్ డిమాండ్..

TPCC : బాక్సింగ్‌ ఛాంపియన్‌, అర్జున్‌ అవార్డు గ్రహీత నిఖత్‌ జరీన్‌ను టీపీసీసీ ఘనంగా సన్మానించింది. హైదరాబాద్‌లోని నిజాం క్లబ్‌లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, అజారుద్దీన్‌, మధుయాష్కీ పాల్గొన్నారు. టీపీసీసీ తరఫున నిఖత్‌ జరీన్‌కు రూ.5 లక్షల బహుమతి అందించారు.

- Advertisement -

నిజామాబాద్‌ చెందిన నిఖత్ జరీన్ ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొని దేశగౌరవ ప్రతిష్ఠలు పెంచారని రేవంత్‌రెడ్డి అన్నారు. సానియా మీర్జా తర్వాత నిఖత్‌ క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. నిఖత్ జరీన్ స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్పీగా నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. జనవరి 26లోపు ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లో భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని పాఠశాలల విద్యార్థులు వచ్చేలా చూడాలని సూచించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు అందరూ కృషి చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News