E-Paper
Advertisement

Rangareddy District: కరెంట్ తీగలపై పతంగి.. తీసే ప్రయత్నంలో బాలుడికి గాయాలు, ఇల్లు దగ్ధం

Rangareddy District: కరెంట్ తీగలపై పతంగి.. తీసే ప్రయత్నంలో బాలుడికి గాయాలు, ఇల్లు దగ్ధం
Advertisement

Rangareddy District: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బాలాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రశాంతినగర్‌లో గణేష్ అనే బాలుడు తన ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకోవాలనే పని మీద ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ గాలిలో ఎగురుతూ వచ్చిన ఒక పతంగి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ వైర్లకు చిక్కుకుపోయింది. ఆ పతంగిని తీయాలనే ఉద్దేశంతో బాలుడు ఒక కర్రను ఉపయోగించి దానిని లాగేందుకు ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తూ, ఆ కర్ర ద్వారా హైటెన్షన్ విద్యుత్ బాలుడికి ప్రవహించడంతో అతను తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన గణేష్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

ఈ ప్రమాదం కేవలం బాలుడికే పరిమితం కాలేదు..  విద్యుత్ షాక్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే..  సమీపంలోని ఒక ఇంట్లో హై-వోల్టేజ్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని ఫ్యాన్లు ఊడి కింద పడిపోయాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఆకస్మిక పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి..  ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

ALSO READ: Srikakulam Road Accident:అయ్యో పాపం.. బైక్‌ను తప్పించబోయి కారును ఢీకొట్టిన లారీ.. కుటుంబం బలి!

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×