E-Paper
Advertisement

కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!

కేటీఆర్ 2 వేల నోటు లాంటివాడు.. మెరుస్తాడు కానీ చెల్లడు.. మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Mettu Sai Kumar: స్వేచ్ఛ బ్యూరో: పదేళ్ల పాటు బూతులు మాట్లాడిన బీఆర్ఎస్..ఇప్పుడు నీతులు చెబితే ప్రజలెవ్వరూ వినే స్థాయిలో లేరని కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఆదివారం కూడా హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

అబద్ధాలలో హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారన్నారు. కేటీఆర్ అంటే కోతల రామారావు అని విమర్శించారు. కేటీఆర్ 2 వేల నోటు లాగ దగడగలాడుతాడని, కానీ చెల్లదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులకు నిజాలు మాట్లాడితే పక్షవాతం వచ్చే రోగం ఉన్నదన్నారు. అందుకే నిత్యం ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

Advertisement

ఇక గతంలో హరీష్​ రావు కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించారని చైర్మన్ గుర్తు చేశారు. ఇక కేటీఆర్ ఎన్ని కోతలు కోసినా.. సోషల్ మీడియాలో ఎన్ని రాతలు రాసినా.. అధికారంలోకి రాలేరన్నారు. 2034 వరకు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారన్నారు. రైతులకు, దళితులకు, మల్లన్న సాగర్ బాధితులను హింస పెట్టింది కేటీఆర్, హరీష్​ రావులేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో రక్తబంధం తెగిపోయిందన్నారు.

Also Read: ఢిల్లీలో భట్టి విక్రమార్క బిజీ బిజీ.. ఖర్గే, వేణుగోపాల్‌లతో హైలెవల్ మీటింగ్!

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×