E-Paper
Advertisement

KTR – Amberpet: అంబర్ పేట్‌లో దంపతుల దారుణ హత్య.. కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్

KTR – Amberpet: అంబర్ పేట్‌లో దంపతుల దారుణ హత్య.. కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్

KTR – Amberpet: ఇటీవల అంబర్ పేట్‌లో దారుణం జరిగింది. వృద్ద దంపతులు లింగా రెడ్డి, ఊర్మిళ దేవిని దారుణంగా హత్య చేశారు దుండగులు. వీరి కుమార్తెలు ఇద్దరూ అమెరికాలో స్థిర పడ్డారు. దీంతో వీళ్లు ఒంటిరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు.. వాళ్లద్దరిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే..  తాజాగా అంబర్ పేట్ సాయిబాబా నగర్‌లో హత్యకు గురైన వృద్ద దంపతులు లింగా రెడ్డి, ఊర్మిళ దేవి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబర్ పేట్ సాయి బాబా నగరంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు శాంతియుతంగా ఉంటున్నారు. కానీ ఇటీవల లింగారెడ్డి, ఊర్మిళా దేవిని పట్టపగలే అతి దారుణంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ప్రతి మనిషినీ.. ఈ జంట హత్య కలిచివేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే..లింగా రెడ్డికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బీఆర్‌ఎస్  ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని అనేక చోట్ల 10 లక్షల సీసీ కెమరాలు ఏర్పాటు చేయడం జరిగింది. బస్తీ, బస్తీకి సీసీ కెమరాలు పెట్టాం అన్నారు. అలాగే శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదని కేటీఆర్ పేర్కొన్నారు. తమ హయాంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పని చెయ్యండని చెప్పామన్నారు. శాంతి భద్రతలు బాగుంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటి వరకూ  లింగారెడ్డి, ఊర్మిళ జంట హత్య కేసును పోలీసులు చేదించలేకపోయారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే అంటున్నారు. హోంశాఖ మంత్రిని నియమించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నా అని.. కేటీఆర్ అన్నారు.

Also Read: కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు భయపడేదు-బండి సంజయ్

పోలీస్‌లను తమ మీద, అశోక్ నగర్‌లో చదువుకునే పిల్లలు మీద కాంగ్రెస్ నేతలు ఉసుగొల్పడం  సరికాదన్నారు. సమర్ధవంతమైన పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. వారికి ఫ్రీడమ్ ఇవ్వండి.. పని చేయమని చెప్పండన్నారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ప్రజలు ఎదురు చూడవద్దన్నారు. హైదరాబాద్‌లో నివసించే  ఎవరికైనా ఇబ్బంది కలిగితే తమకు చెప్పుకోవచ్చన్నారు. బీఆర్ఎస్  ప్రజలకు అండగా ఉంటుందని మీడియా ముందు కేటీఆర్ తెలియజేశారు. పని చేయని సీసీ కెమరాలను బాగు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. చేతకాకపోతే చెప్పండి.. మా సొంత ఖర్చులతో అయినా చేయిస్తాం.. అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×