MLA Sudheer Reddy: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. దోమతెర తో కుట్టించిన గౌన్ ను ఎమ్మెల్యే వేసుకున్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు ఫాగింగ్ మిషన్తో అసెంబ్లీ మీడియా హాల్ కు వెళ్తుండటం సెక్యూరిటీ అడ్డుకున్నారు. పాగింగ్ మిషన్ ను అసెంబ్లీ సెక్యూరిటీ తీసుకున్నారు. అయినప్పటికీ దోమతెర గౌన్ తో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయంలో నాలుగు , ఐదు సార్లు దోమల బెడద లేకుండా చర్యలు తీసుకునే వాళ్ళామని, ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో డెంగ్యూ, మలేరియాతో పేద ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దోమలు అరికట్టలేని ప్రభుత్వం అవసరమా? అని ప్రజలు భావిస్తున్నారన్నారు.
Also Read: నల్లమల్లలో రహస్య ఆలయం – అమర్నాథ్ ను తలపించే ఆలయ విశేషాలు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు మాత్రమే కొన్ని నిబంధనలు ఉంటాయని, దోమల బెడద పై అసెంబ్లీ మీడియా హాల్లో దోమ తెరతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటే మార్షల్స్ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం చేశారన్నారు. మార్షల్స్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్ కు 10 ఫాగింగ్ మిషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
Also Read: అక్రమంగా వేరే రాష్ట్రాలకు తరలిస్తున్న తెలంగాణ వెదురు సంపద