E-Paper
Advertisement

Rythu Runamafi: రైతు రుణమాఫీ పథకం.. కొత్తరాగం అందుకున్న బీఆర్ఎస్

Rythu Runamafi: రైతు రుణమాఫీ పథకం.. కొత్తరాగం అందుకున్న బీఆర్ఎస్
Advertisement

Rythu Runamafi: ఎన్నికల కమిషన్‌నుంచి అనుమతి రాగానే వారంలోపే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఒకవేళ అనుమతి రాకుంటే డిసెంబర్‌ 3 తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క రుపాయి కూడా పెండింగ్ లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే సరిగ్గా ఎన్నికల పోలింగ్ ముందు హరీష్‌ రావు ఈ వ్యాఖ్యలు చేయడం.. కచ్చితంగా రాజకీయ ఎత్తుగడే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో తెలంగాణలో సంక్షేమ పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. రైతులకు ప్రభుత్వ సాయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరు.. కేసీఆర్‌కు పేరు వస్తుందని అన్ని ఆపేయమని చెప్తున్నట్టుగా ఉందని అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి పథకాలను ఈసీ ఆపేయడం మామూలే. కానీ దీనిని కూడా ఎన్నికల స్టంట్‌గా వాడుకుని.. తమపై ఆరోపణలు చేశారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Advertisement

అంతేకాదు ఎన్నికలకు ముందు ఈసీ నుంచి అనుమతులు పొంది.. ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉండి.. సరిగ్గా పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు వ్యూహాత్మకంగా హరీష్‌ రావు ఈ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related News

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

Big Stories

Advertisement
×