E-Paper
Advertisement

వరంగల్‌లో బీఆర్‌ఎస్ ‘రైతు సంగ్రామ సదస్సు’.. కాంగ్రెస్ పాలనపై సమరభేరి!

వరంగల్‌లో బీఆర్‌ఎస్ ‘రైతు సంగ్రామ సదస్సు’.. కాంగ్రెస్ పాలనపై సమరభేరి!
Advertisement

Raithu Sadassu: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి వరంగల్ నగరం వేదిక కానుంది. ఈ నెల 6వ తేదీన వరంగల్‌లో బీఆర్‌ఎస్ (BRS) ఆధ్వర్యంలో ‘రైతు సంగ్రామ సదస్సు’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి సుమారు పది వేల మందికి పైగా రైతులు ఈ మహాసభకు హాజరుకానున్నట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు.

ఏర్పాట్ల పరిశీలన.. పోస్టర్ ఆవిష్కరణ
ఈ సదస్సు విజయవంతం కోసం బీఆర్‌ఎస్ అగ్రనేతలు, మాజీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో కదిలారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్, తాటికొండ రాజయ్య తదితరులు సభా స్థలాన్ని పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులకు, కార్యకర్తలకు అవసరమైన సూచనలు చేశారు. అలాగే, ఈ సదస్సుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను కూడా వారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై వినయ్ భాస్కర్ విమర్శలు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ముఖ్యంగా రైతులను తీవ్రంగా మోసం చేసిందని, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో కళకళలాడిన రైతు వేదికలు, నేడు కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కనువిప్పు కలిగించేలా సదస్సు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ రైతు సంగ్రామ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల పక్షాన పోరాడేందుకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, కాంగ్రెస్ హయాంలో విధ్వంసమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని తిరిగి పునర్నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు, వారి హక్కులను కాపాడేందుకు ఈ సదస్సు ఒక దిక్సూచిలా మారనుందని నేతలు అభిప్రాయపడ్డారు.

Advertisement

Also Read: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దు.. మాజీసీఎం జగన్ కు మంత్రి లోకేశ్ వార్నింగ్

పోటీ మేళాలతో ప్రజలను మభ్యపెట్టవద్దు
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పోటీ సదస్సులు, మేళాలను వినయ్ భాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. “రైతులకు అసలు ఏం మేలు చేశారని ఈ మేళాలు నిర్వహిస్తున్నారు?” అని ప్రశ్నించారు. పోటీ సదస్సులతో ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సదస్సు ద్వారా అన్నదాతల సంక్షేమం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×