E-Paper
Advertisement

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..
Advertisement

Mancherial : మంచిర్యాల జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తూడంటూ..ఓ యువకుడ్ని ఓ కుటుంబం అత్యంత దారుణంగా హత మార్చింది. బండరాయితో కొట్టి హత్య చేసింది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బాధిత మహిళ ఆ యువకుడిని చంపేసింది.

జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో ఈ దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు….ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. బాధితురాలు గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయినా సరే మహేశ్ నుంచి వేధింపులు ఆగకపోవడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఊరంతా చూస్తుండగానే మహేష్ ను కిరాతకంగా హత్య చేశారు. అతడు బైక్‌ వెళుతుండగా అడ్డగించి దాడికి దిగారు. తొలుత గొంతు కోశారు. ఆ తర్వాత బండరాయితో తల పగులకొట్టారు. ఆ సమయంలో స్థానికులు ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

Advertisement

వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి మహేష్‌ను చంపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై విచారణ చేపట్టారు. మహేష్‌ను చంపిన నలుగురు నిందితులను తమకు అప్పగించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

Related News

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. సొంత డబ్బు ఇక బ్యాంకులో!

కాంట్రాక్టర్ యమ సేఫ్ ప్లాన్.. ఏసీబీకి చిక్కిన అధికారి.. ఎలా చిక్కారంటే..?

సునీల్ గవాస్కర్ నుంచి నేను నేర్చుకున్నది ఇదే.. అజహరుద్దీన్ సక్సెస్ మంత్ర!

గవర్నర్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బిగ్ అప్డేట్.. సూచనలు చేస్తానని హమీ!

ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపిక కాలేదా? మీ డబ్బు ఇలా వాపస్

మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్

రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

Big Stories

Advertisement
×