E-Paper
Advertisement

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..

Mancherial : మంచిర్యాల జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తూడంటూ..ఓ యువకుడ్ని ఓ కుటుంబం అత్యంత దారుణంగా హత మార్చింది. బండరాయితో కొట్టి హత్య చేసింది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బాధిత మహిళ ఆ యువకుడిని చంపేసింది.

జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో ఈ దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు….ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. బాధితురాలు గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయినా సరే మహేశ్ నుంచి వేధింపులు ఆగకపోవడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఊరంతా చూస్తుండగానే మహేష్ ను కిరాతకంగా హత్య చేశారు. అతడు బైక్‌ వెళుతుండగా అడ్డగించి దాడికి దిగారు. తొలుత గొంతు కోశారు. ఆ తర్వాత బండరాయితో తల పగులకొట్టారు. ఆ సమయంలో స్థానికులు ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి మహేష్‌ను చంపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై విచారణ చేపట్టారు. మహేష్‌ను చంపిన నలుగురు నిందితులను తమకు అప్పగించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×