E-Paper
Advertisement

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..
Advertisement

Mancherial : మంచిర్యాల జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తూడంటూ..ఓ యువకుడ్ని ఓ కుటుంబం అత్యంత దారుణంగా హత మార్చింది. బండరాయితో కొట్టి హత్య చేసింది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బాధిత మహిళ ఆ యువకుడిని చంపేసింది.

జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో ఈ దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు….ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. బాధితురాలు గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయినా సరే మహేశ్ నుంచి వేధింపులు ఆగకపోవడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఊరంతా చూస్తుండగానే మహేష్ ను కిరాతకంగా హత్య చేశారు. అతడు బైక్‌ వెళుతుండగా అడ్డగించి దాడికి దిగారు. తొలుత గొంతు కోశారు. ఆ తర్వాత బండరాయితో తల పగులకొట్టారు. ఆ సమయంలో స్థానికులు ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

Advertisement

వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి మహేష్‌ను చంపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై విచారణ చేపట్టారు. మహేష్‌ను చంపిన నలుగురు నిందితులను తమకు అప్పగించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×