Cafe Nilofer: మానవ సేవ పరమార్థంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రి ట్రస్ట్కు ప్రముఖ హైదరాబాద్ సంస్థ నుండి పెద్ద మొత్తంలో విరాళం అందింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులు, బాబురావు అనుముల, శశాంక్ అనుముల అనే భక్తులు శనివారం టీటీడీ బర్డ్ ట్రస్ట్కు రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందించారు.
ఈ విరాళాన్ని సంస్థ అధినేతలు బాబురావు అనుముల, శశాంక్ అనుముల తిరుపతిలో టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ, ముఖ్యంగా ‘కేఫ్ నిలోఫర్’ పేరుతో హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెంది ఉంది. వీరి దాతృత్వం ద్వారా అనాథలు, పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బర్డ్ ఆసుపత్రికి మరింత బలం చేకూరనుంది. గతంలో కూడా ఈ సంస్థ టీటీడీ ధార్మిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించింది.
బర్డ్ ఆసుపత్రి ఆధునిక సదుపాయాలతో ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నవారికి.. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తోంది. ఇక్కడ ఉచితంగా.. రాయితీపై చికిత్స అందిస్తారు. శ బాబురావు, శ శశాంక్ తమ సంస్థ లాభాలలో కొంత భాగాన్ని పవిత్రమైన బర్డ్ ట్రస్ట్కు అందించడం గొప్ప విషయం. ఈ సేవా దృక్పథం తమ ఆధ్యాత్మిక చింతన, సమాజ సేవ పట్ల వారికి గల నిబద్ధతను తెలియజేస్తుంది. విరాళం అందజేసిన అనంతరం సంస్థ ప్రతినిధులు బర్డ్ ఆసుపత్రి సేవలను, ముఖ్యంగా పేదలకు అందిస్తున్న ఉచిత వైద్య చికిత్సలను అభినందించారు.
ఈ విరాళం అందిన సందర్భంగా టీటీడీ అధికారులు ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు టీటీడీ తరపున స్వామివారి ప్రసాదాన్ని, శాలువను అందజేసి సన్మానించారు. ఇలాంటి దాతృత్వ సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం వల్ల టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడానికి అవకాశం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. భక్తుల నుండి అందిన ఈ నిధులను రోగుల చికిత్స, ఆసుపత్రి నిర్వహణ, అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ఉపయోగిస్తారు.