E-Paper
Advertisement

Camera In Wash Room: ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన…. బాలికల వాష్ రూంలో కెమెరా!

Camera In Wash Room: ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన…. బాలికల వాష్ రూంలో కెమెరా!
Advertisement

Camera In Wash Room: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికల వాష్‌రూమ్‌లో అటెండర్ యాకూబ్ పాషా గోప్యంగా కెమెరా అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు బాలికలు గుర్తించారు. వాష్‌రూమ్‌లో కెమెరా అనుమానాస్పదంగా మెరుస్తుడడంతో గమనించిన కొందరు బాలికలు, తమ తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాలహెడ్మాస్టర్ పై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గంగాధర ఎస్‌ఐ వంశీ కృష్ణ, సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి, వాష్ రూమ్ నుంచి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ALSO READ: Shocking Video: పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు.. కాపాడే ప్రయత్నంలో

Advertisement

“కొంతమంది పిల్లలు అటెండర్ వలన ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. పిల్లలు ఆ ఇబ్బందికి సంబంధించిన నివేదికను తయారు చేసుకున్నారు. ఆ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.” అని గంగాధర ఎంఈఓ ప్రభాకర్ రావు తెలిపారు. పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, స్నేహిత, సఖీ టీమ్ ద్వారా ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయిలందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. ఏదైనా ఇబ్బంది పడితే చెప్పడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని, జిల్లా కలెక్టర్ వీటిని ఆర్గనైజ్ చేస్తున్నారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. సఖీ కేంద్రం వారు కూడా తమ నివేదిక తయారుచేసి ఉన్నత అధికారులకు సమర్పిస్తారు.ఉన్నతాధికారులు చెప్పిన విధంగా తాము నడుచుకుంటామని తెలిపారు.

Advertisement

ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా, విద్యార్థినుల ఫోటోలు తీసి అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు మధురానగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించాయి. నిందితుడిని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గంటసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

 ఘటనపై స్పందించిన బండి సంజయ్:

గంగాధరలోని పాఠశాల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. టాయిలెట్లలో కెమెరాలు పెట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైనంపై కరీంనగర్ రూరల్ ఏసీపీతో బండి సంజయ్ మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్దనున్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×