E-Paper
Advertisement

Minister Seethakka: సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం

Minister Seethakka: సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క.. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం
Advertisement

Minister Seethakka: ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ ఆలయంలో.. అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిన ఈ ప్రాజెక్ట్‌పై.. మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణానికి సందర్శించి జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు.

సమ్మక్క సారలమ్మ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో కోట్లాది భక్తులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం, రోడ్లు, మురికినీటి డ్రైనేజ్, తాగునీటి సరఫరా, భక్తుల వసతి గృహాలు, పార్కింగ్ ప్రాంతాలు, లైటింగ్ వంటి సౌకర్యాలను కల్పిస్తోంది.

Advertisement

ప్రస్తుతం ఆలయ విస్తరణ పనులు, పక్కన ఉన్న పునరావాస ప్రాంగణ అభివృద్ధి, టెంపుల్ చుట్టూ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.120 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ పనుల్లో.. 80 శాతం పూర్తి కాగా, మిగిలిన భాగం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సీతక్క స్పష్టం చేశారు.

సోమవారం మేడారానికి చేరుకున్న మంత్రి సీతక్కకు అధికారులు, ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. పని నాణ్యత, నిర్మాణ వేగం, భక్తులకు కల్పించే సౌకర్యాలపై అధికారులు ఇచ్చిన వివరాలను ఆమె సమీక్షించారు.

Advertisement

Also Read: పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్

తర్వాత జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు.. ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా కలెక్టర్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, రోడ్డు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి శాఖ అధికారులు తమ పనుల పురోగతిపై వివరాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో డ్రైనేజ్ సిస్టమ్, లైటింగ్, నీటి సరఫరా వంటి పనులు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×