Hostel Dispute: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి పై కేసు నమోదైంది. పంజాగుట్ట హాస్టల్ వివాదంలో బొంతు శ్రీదేవితో పాటు ఆమె తల్లి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసారు. మరోవైపు బొంతు శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాస్టల్ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు.
హైదరాబాద్ పంజాగుట్ట లోని ఏషియన్ పీజీ హాస్టల్లో జరిగిన వివాదంలో ఇరుపక్షాలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి పై ఆమె తల్లి బయమ్మ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బొంతు శ్రీదేవి 30 మందితో హాస్టల్ పై నిర్వాహకులపై దాడి చేసినట్లు ఫిర్యాదులో నిర్వాహకులు పేర్కొన్నారు. బొంతు శ్రీదేవి రాజకీయ పలుకుబడితో బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
Also Read: రేపు మేడ్చల్లో ‘ప్రజాపాలన ప్రగతి’ జాతర: కలెక్టర్ మను చౌదరి
హాస్టల్ భవన యజమానులు బొంతు శ్రీదేవిల నుండి తమకు ప్రాణహాని ఉందని హాస్టల్ నిర్వాహకుడు వీర హనుమాన్ రెడ్డి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బొంతు శ్రీదేవి ఆమె తల్లిపై 115(2), 126(2), 127(2), 351(2), 324(4), r/w 3(5) BNS సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి బొంతు శ్రీదేవి సైతం హాస్టల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరి ఫిర్యాదు మేరకు నిర్వాహకులు రాజ్యలక్ష్మి.. అపర్ణాలపై సైతం పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ధాన్యం సేకరణలో.. జిల్లా కలెక్టర్లు విఫలం! క్షేత్రస్థాయి పర్యటనల్లేవు.. పరిశీలనా లేదు..!