E-Paper
Advertisement

Kavitha : కవిత ఇంటికి సీబీఐ అధికారులు.. ఢిల్లీ మద్యం స్కామ్ పై ప్రశ్నలు..

Kavitha : కవిత ఇంటికి సీబీఐ అధికారులు.. ఢిల్లీ మద్యం స్కామ్ పై ప్రశ్నలు..
Advertisement

Kavitha : ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో కవిత ఇంటికి రెండు బృందాలు వచ్చాయి. విచారణ కోసం కవిత ఇంట్లోని ఒక గదిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. తన అడ్వకేట్ సమక్షంలో స్టేట్ మెంట్ ను కవిత ఇస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో సాక్షిగా మాత్రమే కవిత వివరణను సీబీఐ అధికారులు నమోదు చేస్తున్నారు. సీఆర్‌పీసీ 160 కింద వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. విచారణకు వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారులు ఉన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో ఈ నెల 6న కవితను విచారించేందుకు సీబీఐ మొదట లేఖ రాసింది. అయితే ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలున్నాయని 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని కవిత సీబీఐకి తిరిగి లేఖ రాశారు. దీంతో సీబీఐ ఈ నెల 11న విచారిస్తామని సమాచారం ఇవ్వగా కవిత అంగీకరించారు. దీంతో హైదరాబాద్ లోని ఆమె నివాసానికి సీబీఐ అధికారులు వచ్చారు.

Advertisement

ఢిల్లీ మద్యం స్కామ్ లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తర్వాత.. ఆమెకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నిందితులు బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు కవిత శనివారం ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కవితతో కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజకీయకక్షతో ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా… అవి ఫలించవని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. సీబీఐకి ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించారట. సీబీఐ విచారణ నేపథ్యంలో ఇప్పటికే కవిత పలువురు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు.

Advertisement

పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ తన ఇంటికి రావద్దని కవిత కోరారు. అయినాసరే బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. “డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. విల్‌ నెవర్‌ ఫియర్‌” అనే స్లోగన్ తో ఫ్లెక్సీలు పెట్టారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె ఇంటికి భారీగా వస్తారనే సమాచారంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తంమీద కవితను ప్రశ్నించడానికి సీబీఐ బృందం రావడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరింగి.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×