Cellulitis Disease: వర్షాకాలం వస్తే చాలు.. వ్యాధులు విజృంభిస్తాయి. అలా ప్రస్తుతం పడగవిప్పుతోంది సెల్యూలైటిస్ వ్యాధి. ఈ వ్యాధి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను భయపెడుతోంది. ఇంతకీ సెల్యూలైటిస్ వ్యాధి లక్షణాలు ఏంటంటే.. ఇదో బ్యాక్టీరియా సంబంధిత చర్మవ్యాధి. చర్మంపై చిన్న గాయం, పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి.. ఆ భాగం ఎర్రబడి, వాపు, నొప్పి వస్తుంది. చర్మంపై బొబ్బలు వచ్చి ఫంగస్ ఏర్పడటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. మధుమేహం ఉన్నవారికి వ్యాధి సోకితే మహా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు గమనించి చికిత్స తీసుకుంటే నాలుగైదు రోజుల్లోనే తగ్గుతుందని.. ఫంగస్ ఏర్పడితే మాత్రం… రోగిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సిందేనని అంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించారు. మరోవైపు వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు చెబుతున్నారు.
లక్షణం చిన్నదే… కానీ నిర్లక్ష్యం ప్రాణాంతకం. సో.. వర్షాకాలంలో చర్మంపై ఏ మార్పు కనిపించినా… వెంటనే వైద్యుడిని కలవడమే ఉత్తమం.
Also Read: ‘అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు’.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!