E-Paper
Advertisement

Rakesh Reddy: చిగురుపాటి జయరాం హత్య కేసు.. రాకేశ్‌రెడ్డికి జీవిత ఖైదు

Rakesh Reddy: చిగురుపాటి జయరాం హత్య కేసు.. రాకేశ్‌రెడ్డికి జీవిత ఖైదు

Rakesh Reddy: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న రాకేశ్ రెడ్డిని ఇటీవల దోషిగా తేల్చిన కోర్టు.. తాజాగా అతనికి జీవితఖైదు విధిస్తూ తుది తీర్పు వెలువరించింది.

ఈ కేసుకు సంబంధించి ఇటీవల 23 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. అందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. హనీట్రాప్‌తో రాకేశ్‌రెడ్డి కుట్రపన్ని.. జయరాంను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పక్కా ఆధారాలను ఛార్జిషీట్‌తో జతపరిచారు. మొత్తం 73 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఈ కేసులో 11 మందిని నిర్దోషులుగా తేల్చింది. ఏసీపీ మల్లారెడ్డితో పాటు మరో ఇద్దరు సీఐలను నిర్దోషులుగా ప్రకటించింది.

2019 జనవరి 31న జయరాం హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యను రాకేశ్‌ తన స్నేహితులతో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. జయరాం మృతదేహాన్ని విజయవాడలోని నందిగామ రహదారిపై వాహనంలో ఉంచారు. డబ్బుల వ్యవహారంలోనే రాకేశ్‌ హత్యకు పాల్పడ్డారని 2019 మేలో పోలీసులు నేరాభియోగ పత్రం దాఖలు చేశారు. ఈ కేసుపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ కొనసాగింది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×