CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 వరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల గిరిజన బిడ్డ రమేశ్ నాయక్కు ఈ పురస్కారం అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
గొప్ప వరం
చిన్న వయస్సులో ధావ్లో రచనకు పురస్కారం రావడంతో రమేష్కు సీఎం అభినందనలు తెలిపారు. ఈ అవార్డు గిరిజనుల సంస్కతి, సంప్రదాయాలకు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వరమన్నారు. రమేష్.. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు.