E-Paper
Advertisement

CM Revanth Reddy: ఛాతీలో బాణం దిగిన యువకుడిని కాపాడిన వైద్యులు.. అభినందించిన సీఎం రేవంత్

CM Revanth Reddy: ఛాతీలో బాణం దిగిన యువకుడిని కాపాడిన వైద్యులు.. అభినందించిన సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy Appreciated NIMS Doctors: నిమ్స్ వైద్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సోషల్ మీడియా వేదిక వారికి సీఎం కితాబిచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం స్పందిస్తూ నిమ్స్ వైద్యులకు అభినందనలు తెలిపారు. ప్రజల్లో నిమ్స్ పై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారంటూ కితాబిచ్చారు. అదేవిధంగా భవిష్యత్తులో నిమ్స్ మరింతగా అభివృద్ధి చెంది విస్తృతంగా వైద్య సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

కాగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన ఆదివాసీ యువకుడికి వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఛాతీలో బాణం దిగింది. ఆ బాణం సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్యలో దిగటంతో బాధితుడిని కుటుంబ సభ్యులు భద్రాచలం ఆసుపత్రికి, ఆ తరువాత వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Advertisement

Also Read: శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం.. 30 లక్షల ఉద్యోగాల భర్తీ..

అయితే, పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్ కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. నిమ్స్ లో వైద్యులు అతడికి దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి ఛాతీలో దిగిన బాణాన్ని తీసి, యువకుడిని కాపాడారు. ప్రస్తుతం ఆ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు పేర్కొన్నారు.

Advertisement

అయితే, యువకుడు ఆసుపత్రికి వెళ్లగానే మొదటగా వైద్యులు తొలుత సీటీస్కాన్ తీశారు. లంగ్స్ పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే అప్పటికే తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో అతడికి ఒకవైపు రక్తాన్ని ఎక్కిస్తూనే నాలుగు గంటలపాటు శస్త్రచికిత్స చేసి ఛాతీలోంచి బాణాన్ని తొలగించారు. అయితే, బాణం చొచ్చుకుపోయిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు.

‘గిరిజన యువకుడు సోది నంద ఛాతిభాగంలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించి నిండు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్య బృందానికి నా అభినందనలు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దావాఖాన పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు. భవిష్యత్ లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించి, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×